Gulf War: మళ్ళీ ఆ పరిస్థితికి చేరుకున్న ఖతార్, కువైట్.. గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Saudi Aramco: సౌదీ చమురు కేంద్రంపై డ్రోన్ల దాడి... ఇంధన మార్కెట్లో ఆందోళన! Gulf War: మళ్ళీ ఆ పరిస్థితికి చేరుకున్న ఖతార్, కువైట్.. గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం! Visa Rules: ఒమన్‌ వెళ్లే భారతీయులకు అలర్ట్! కొత్త వీసా నిబంధనలు... ఇక నుండి అవి తప్పనిసరి! Kuwait: కువైట్ తీరంలో నౌకపై దాడి! పర్షియన్ గల్ఫ్‌లో విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు! UAE ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం... స్వదేశానికి చేరుకున్న 300 మంది భారతీయులు! Saudi Aramco: సౌదీ చమురు కేంద్రంపై డ్రోన్ల దాడి... ఇంధన మార్కెట్లో ఆందోళన!

UAE News: 2026 నుంచి యూఏఈలో కీలక మార్పులు.. పన్నులు, ప్లాస్టిక్ నిషేధం, పాఠశాల టైమింగ్స్‌లో కొత్త నిబంధనలు. !!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2026 జనవరి 1 నుంచి  ప్రతి ఒక్కరి రోజువారీ జీవనశైలిని ప్రభావితం చేసే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలో బుర్జ

Published : 2025-12-29 14:17:00
BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 2026 జనవరి 1 నుంచి  ప్రతి ఒక్కరి రోజువారీ జీవనశైలిని ప్రభావితం చేసే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది ఆరంభంలో బుర్జ్ ఖలీఫా వద్ద అగ్నిపర్వతాల్లా మెరిసే ఫైర్‌వర్క్స్ ముగిసిన తర్వాత, యూఏఈ ప్రజలు కొత్త క్యాలెండర్‌కే కాకుండా కొత్త నిబంధనల యుగానికి అడుగుపెట్టనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ “రెగ్యులేటరీ రీసెట్” లక్ష్యం స్పష్టంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ, పన్నుల పారదర్శకత, విద్యా వ్యవస్థలో సమతుల్యత, డిజిటల్ వృత్తుల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలను బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఈ మార్పులను గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే జరిమానాలు తప్పవని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Elon Musk: 8 గంటల వెయిటింగ్‌.. ప్రాణం పోయింది.. కెనడా హెల్త్‌కేర్‌పై ఎలాన్ మస్క్ ఫైర్!

పర్యావరణ పరిరక్షణ దిశగా యూఏఈ మరో కీలక అడుగు వేస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం 2026 నుంచి మరింత విస్తృతంగా అమల్లోకి రానుంది. ప్లాస్టిక్ కప్పులు, మూతలు, స్పూన్లు, ఫోర్కులు, ప్లేట్లు, స్ట్రాలు, స్టిరర్లు, స్టైరోఫోమ్‌తో తయారైన ఫుడ్ బాక్సులు ఇకపై దేశంలో అనుమతించబడవు. ఈ నిషేధం దిగుమతులు, తయారీ, విక్రయాలన్నింటికీ వర్తిస్తుంది. సాధారణ ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు మార్కెట్‌లో దొరికితే సంబంధిత వ్యాపారాలపై కనీసం రెండు వేల దిర్హామ్  జరిమానా విధించనున్నారు. అదే తప్పిదం పునరావృతమైతే జరిమానా పదివేల దిర్హాముల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వెనుక పర్యావరణాన్ని కాపాడాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.

IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..!

ఇక విద్యా రంగంలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2026 జనవరి నుంచి శుక్రవారం జుమా నమాజ్ సమయాన్ని దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12:45కు ఒకేలా అమలు చేయనున్నారు. దీనికి అనుగుణంగా పాఠశాలల పని వేళల్లో మార్పులు చేశారు. దుబాయ్‌లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం ఉదయం 11:30 గంటలకల్లా తరగతులు ముగించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు, సిబ్బంది సకాలంలో మసీదులకు చేరుకునే అవకాశం ఉంటుంది. పెద్ద తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసుల అనుమతి ఉన్నా, సంబంధిత విద్యా సంస్థల అనుమోదనం తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించని పాఠశాలలపై నియంత్రణ చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

అన్నయ్య పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. అధికారికంగా ప్రకటించిన టాలీవుడ్ నటుడు! ఎప్పుడు అంటే.?

పన్నుల వ్యవస్థలో కూడా కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. 2026 నుంచి పన్ను రిఫండ్ల విషయంలో “యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్” అనే సూత్రాన్ని అమలు చేయనున్నారు. అంటే అదనంగా చెల్లించిన వ్యాట్ లేదా క్రెడిట్‌ను ఐదేళ్లలోపు క్లెయిమ్ చేయకపోతే ఆ హక్కు కోల్పోతారు. అలాగే పన్ను ఎగవేత అనుమానం ఉన్న కేసులను ప్రభుత్వం 15 సంవత్సరాల వరకు ఆడిట్ చేసే అధికారం కలిగి ఉంటుంది. సరఫరాదారులపై సరైన పరిశీలన చేయకుండా వ్యాపారం చేస్తే వ్యాట్ రికవరీ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు, సోల్ ట్రేడర్లు కార్పొరేట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే భారీ జరిమానాలు తప్పవు.

ఫుల్ జోష్‌లో యాపిల్.. ఐఫోన్ 16 అమ్మకాలు సరికొత్త రికార్డు.. భారత్‌లో అత్యధికంగా..

సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నవారికి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. డబ్బు లేదా బహుమతుల రూపంలో బ్రాండ్లను ప్రమోట్ చేసే ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్ 2026 జనవరి 31లోపు ప్రొఫెషనల్ పర్మిట్ పొందాలి. ఈ పర్మిట్ లేకుండా ప్రకటనలు చేస్తే పది వేల దిర్హాముల జరిమానాతో పాటు ఖాతాల సస్పెన్షన్ ప్రమాదం కూడా ఉంది. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ ప్రకటన రంగంలో పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే..

ఇక చక్కెర పానీయాలపై విధించే పన్నుల్లో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒకే రేటుగా ఉన్న షుగర్ ట్యాక్స్‌ను ఇకపై చక్కెర శాతం ఆధారంగా వసూలు చేయనున్నారు. ఎక్కువ చక్కెర ఉన్న పానీయాలపై అధిక పన్ను విధించడం ద్వారా ప్రజలను ఆరోగ్యకరమైన ఎంపికల వైపు ప్రోత్సహించాలన్నదే లక్ష్యం. అవసరమైన ల్యాబ్ నివేదికలు సమర్పించని కంపెనీల ఉత్పత్తులు ఆటోమేటిక్‌గా అత్యధిక పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి.

Eyebomma Ravi : ఐబొమ్మ రవి కేసులో ట్విస్ట్.. ప్రహ్లాద్ పేరు మీద పాన్, లైసెన్స్!
సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..!
Kuwait Visa: కువైట్‌ ఉద్యోగులకు శుభవార్త.. వీసా రెసిడెన్సీ ప్రక్రియలు మరింత సులభం..!!
AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల!
BSNL: డేటా లవర్స్‌కు జాక్‌పాట్! రూ.251కే 100GB డేటా… కాలింగ్ ఫ్రీ..!

Spotlight

Read More →