AP Development: ఏపీ ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్... ముంబై తరహాలో ఆ జిల్లా అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారనున్నాయి. ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మాస్టర్

2026-01-17 07:27:00
Pattadar Passbook: చంద్రబాబు కీలక ప్రకటన...! ప్రతి నెలా పట్టాదారు పుస్తకాల పంపిణీ !

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారనున్నాయి. ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ గ్రోత్ హబ్ కార్యక్రమంలో భాగంగా, విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

ఏపీకి కొత్త గుర్తింపు… రూ.13 వేల కోట్ల గ్రీన్ అమోనియా మెగా ప్రాజెక్ట్‌తో క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ముందడుగు!

ఈ ప్రణాళికల అమలులో భాగంగా, ఏపీ ప్రభుత్వ అధికారుల బృందం ఇటీవల ముంబైకి వెళ్లి అక్కడి పట్టణాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసింది. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) అమలు చేస్తున్న విధానాలు, నిధుల సమీకరణ పద్ధతులను పరిశీలించారు. ముఖ్యంగా భూసంపద ఆధారంగా స్వయం సమృద్ధిగా ఎలా అభివృద్ధి సాధించవచ్చో అధ్యయనం చేశారు.

National Highway: ఆ ప్రాంతవాసుల నిరీక్షణకు బైబై… రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత విముక్తి.!!

నీతి ఆయోగ్ సూచనల మేరకు, కైలాసగిరి నుంచి భీమిలి మధ్య బే సిటీ అభివృద్ధి చేయాలని, విశాఖపట్నం 2.0ను భోగాపురం విమానాశ్రయం వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే గ్రీన్‌ఫీల్డ్ భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ఆలోచనకు రూపకల్పన జరుగుతోంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ల్యాండ్ మానిటైజేషన్, FSI ప్రీమియంల ద్వారా సమకూర్చుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

Railway News: రైల్వే టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – ఇకపై ఇవి తప్పనిసరి..!

ముంబైలోని నవీ ముంబై, NAINA (నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా) వంటి అభివృద్ధి నమూనాలను బెంచ్‌మార్క్‌లుగా తీసుకొని, వైజాగ్ 2.0, భోగాపురం ఏరోసిటీ ప్రాజెక్టులను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CIDCO సుమారు రూ.14,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో భూమి, రియల్ ఎస్టేట్ ఆదాయాల ద్వారా స్వయం సమృద్ధిగా పనిచేస్తున్న తీరు అధికారులకు ప్రేరణగా నిలిచింది.

Indians in Iran: ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు… అప్రమత్తమైన భారత్.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

ఇందులో భాగంగా దక్షిణాన విశాఖపట్నం పోర్ట్ నుంచి ఉత్తరాన భోగాపురం విమానాశ్రయం వరకు 200–250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ హబ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. కైలాసగిరి–భీమిలి మధ్య 25 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని వాటర్‌ఫ్రంట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయి. అలాగే మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురంలోని ఐటీ, డేటా సెంటర్ హబ్‌లు, వైజాగ్ బే సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా విశాఖ భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయి నగరంగా మారనుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

భారీ కోడి పందెం.. ఈ ఏడాది అక్కడ ఇదే అతిపెద్ద పందెం..!
రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!
8,000కు పైగా ఉద్యోగ అవకాశాలు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కీలక స్థానం!
ఫిబ్రవరి 1 ఎంతో ప్రత్యేకం.. ఒకవైపు బడ్జెట్‌.. మరోవైపు ఆదివారం! స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి ఏంటంటే..?
Blood sugar: షుగర్ తగ్గాలా.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న అలవాటు చాలు!

Spotlight

Read More →