వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు లో సీబీఐ కోర్టుకు హాజరైన కడప ఎంపీ అవినాశ్రెడ్డి
వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాశ్రెడ్డి
ఇతర నిందితులైన గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి తదితరులు కూడా కోర్టుకు హాజరు
తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసిన కోర్టు
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు గంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కూడా కోర్టుకు హాజరయ్యారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వాదనల అనంతరం కోర్టు మార్చి 12కు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఇన్స్టంట్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాల్లో జరా భద్రం!! లేదంటే మీకే రిస్క్!!
ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ రెడ్మీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు..! మరెందుకు ఆలస్యం ఒక లుక్ వేసేయండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: