Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం!

Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం!

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను సమర్థిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు. సెక్షన్ 5 సవరణ ద్వారా రాజధానిని కాపాడుకోవాలని, గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు..

Published : 2026-03-28 13:01:00

Amaravati Legal Status: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరణ కోసం కేంద్రాన్ని కోరి నిర్ణయించడం అత్యంత న్యాయబద్ధమైన చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని షర్మిల స్వాగతించారు. గతంలో జగన్ వంటి నాయకులు అధికారంలోకి వచ్చి, అమరావతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజధానికి పటిష్టమైన చట్టపరమైన రక్షణ అవసరం అని షర్మిల విశ్లేషించారు. భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చలేని విధంగా చట్టాలను రూపొందించడం పాలకుల విజన్‌కు నిదర్శనమని కొనియాడారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పేర్కొన్న సెక్షన్ 5ను సవరించడం ద్వారా, అమరావతిని ఏకైక  శాశ్వత రాజధానిగా కేంద్ర రికార్డుల్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంనీ కోరారు. దీనిపై షర్మిల స్పందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కేంద్రం నుంచి అధికారికంగా ఆమోదం పొందే వరకు ప్రభుత్వం విశ్రమించకూడదని సూచించారు.

అమరావతి రైతులు, ప్రజలు పడిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఈ తీర్మానం వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉందని  అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గతంలో జరిగిన గందరగోళానికి ఈ చట్టబద్ధమైన చర్యల ద్వారా ముగింపు పలకవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చే సంప్రదాయానికి స్వస్తి పలికితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని షర్మిల స్పష్టం చేశారు. అమరావతి మనుగడపై ప్రభుత్వం చూపుతున్న ఈ స్పష్టతను ఆమె సమర్థించడమే కాకుండా ఇది రాష్ట్ర ప్రజల విజయంగా అభివర్ణించారు.

Spotlight

Read More →