Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

Thanks farmers: 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు... 2028 నాటికి అమరావతి పూర్తవుతుంది!

అమరావతి అభివృద్ధి కార్యక్రమం కొత్త ఊపును అందుకుంటోంది. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని న

Published : 2025-11-28 13:00:00
Amaravati: అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు భేటీ.. సమస్యల పరిష్కారానికి కీలక దిశ!!

అమరావతి అభివృద్ధి కార్యక్రమం కొత్త ఊపును అందుకుంటోంది. అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు. సుమారు 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు రైతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానం విజయవంతంగా అమలైన ఏకైక ప్రాంతం ప్రపంచంలో అమరావతేనని, ఇది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా స్ఫూర్తిదాయక మోడల్‌గా నిలిచిందని చెప్పారు.

Amaravati: అమరావతి రైతుల త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది.. నారా లోకేశ్!

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పనులకు పునఃప్రారంభం చేసి పునర్నిర్మాణానికి నూతన ఊపు తెచ్చారని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని, 2028 మార్చి నాటికి ప్రధాన నిర్మాణాలు పూర్తికావడానికి ప్రణాళిక సిద్ధమైందని ప్రకటించారు. ఈ వేగవంతమైన అభివృద్ధికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాన కారణమని అన్నారు. ఆమె అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుని అమరావతికి నిధుల మద్దతునిచ్చారని, రూ. 15 వేల కోట్ల నిధులను కేంద్రం వేగంగా విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Amaravati: అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్ వేగవంతం – 44,676 ఎకరాల సమీకరణకు సర్కార్ సిద్ధం!

ఈ కార్యక్రమంలో రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు మరియు బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఒకే ప్రదేశంలో అన్ని బ్యాంక్ మరియు బీమా కార్యాలయాలు ఉంటే ప్రజలకు,వ్యాపారాలకు అమోఘమైన ప్రయోజనాలు కలుగుతాయని, అవి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 6,576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు.

Australia News: ఆస్ట్రేలియా బీచ్‌లో షార్క్ దాడి.. మహిళ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – బీచ్ మూసివేత!

జీఎస్టీ సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్‌గా మారాయని, ఈ సంస్కరణలకు నిర్మలా సీతారామన్ నాయకత్వం ప్రశంసనీయం అని అన్నారు. అమరావతి అభివృద్ధి ఊపందుకున్న సమయంలో గత ప్రభుత్వం పడిపోయిందని, వైసీపీ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నశించిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్న ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ద్వారా రాష్ట్రం తిరిగి నిలబడగలిగిందని చెప్పారు. అయితే ఇంకా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సమయం అవసరమని, అందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు.

2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా?

అమరావతిని భారతదేశం గర్వపడే నగరంగా, అత్యాధునిక రాజధానిగా, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడు జాతీయ రహదారులు అమరావతితో అనుసంధానమవుతాయని, ఇది దేశంలో అత్యంత సమర్థవంతమైన కనెక్టివిటీ కలిగిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2028 నాటికి అన్ని ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యేలా కార్యాచరణ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత స్థిరపడాలనుకునే వారికి అమరావతి అత్యుత్తమ గమ్యస్థానమవుతుందని, జీవన ప్రమాణాలు అత్యున్నతస్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. అమరావతి కల నిజమవుతుందని, రైతుల త్యాగం వృథా కాకుండా ఈ రాజధాని దేశంలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు దృఢంగా ప్రకటించారు.

UAE: దుబాయ్ చరిత్రకు మీరే కథకులు.. మీ కుటుంబ కథ, జ్ఞాపకాలు పంచుకోండి, జాతీయ నిధిలో భాగం కండి!
UAE Pakistan వీసా పరిమితులు.. సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు కష్టాలు!
Stranger Things 5: ‌ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఒకేసారి లాగిన్ కావడంతో.. నెట్‌ఫ్లిక్స్ షట్‌డౌన్!! ఆ ఒక్క వెబ్ సిరిసే కారణం!!
New Airports: ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు గడువు కంటే ముందే పూర్తి! కొత్తగా మరో 6 ఎయిర్‌పోర్టులు.. మంత్రి కీలక ప్రకటన!
Panchayat Reforms: గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Data Center Hub: విశాఖలో డేటా సెంటర్ల వెల్లువ! ఏఐ ఆధారిత మేగా ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్!
TTD News: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కుంభకోణం.. టిటిడి ఇంజినీర్ అరెస్టుతో దర్యాప్తు వేగం!!

Spotlight

Read More →