Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా! Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ షాక్.. తమిళనాట నిలిచిన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ! Tamil Nadu: 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్న నూతన సీఎం! Political Updates: తోపుదుర్తికి పోలీసుల నోటీసులు! తమిళనాట సర్కార్ ఏర్పాటుకు వేళాయే... AP Govt: ఆ జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్.. కడపలో రూ.12 వేల కోట్లతో - తిరుపతిలో రూ.2,500 కోట్లతో! Dwakra womens: డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్: రూ.13,000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్'.. భారీ సబ్సిడీతో పుట్టగొడుగుల సాగు! Farmers: చెరకు రైతులకు కేంద్రం భారీ ఊరట... క్వింటాల్‌కు రూ.365గా మద్దతు ధర ఖరారు!! SriCity: శ్రీసిటీకి క్యారియర్ కళ: రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ కేంద్రం.. మంత్రి లోకేష్ శంకుస్థాపన! Vangalapudi Anita: రాజకీయ నాయకులకు చుక్కలు.. హెల్మెట్ లేకపోతే డబుల్ ఫైన్ కట్టాల్సిందే! హోంమంత్రి కీలక ఆదేశాలు.. West Bengal: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీ.. ఆమెను బయటకు గెంటేయండి! మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్.. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా!

Chandrababu: రైతులకు లాభదాయక ధరలు లక్ష్యం.. పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Chandrababu: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 2026-05-06 20:14:00

రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్ల పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని సీఎం దిశానిర్దేశం..

అమరావతి: రాష్ట్రంలో రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ వంటి ముఖ్య పంటల కొనుగోళ్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలంటే మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.

పంటలకు మంచి ధరలు రావాలంటే ట్రేసబిలిటీ (పంట మూలాన్ని గుర్తించే విధానం), సర్టిఫికేషన్ వంటి వ్యవస్థలను అమలు చేయాలని సూచించారు. ఇవి రైతులకు అదనపు లాభం అందించే అవకాశముందని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చే అవకాశముందని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నాణ్యమైన దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే, ప్రకృతి సేద్యం విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు. విభిన్న పంటలను సాగు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని ఆయన వివరించారు. రైతు ఆదాయం పెరగడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

Spotlight

Read More →