Inner Ring Road: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆ 15 గ్రామాలకు మహర్దశ! Mega Project: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... రూ. 20,000 కోట్లతో మెగా ప్రాజెక్ట్... అక్కడే ఫిక్స్!! National Highway: ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి... 7 నేషనల్ హైవేలతో అనుసంధానం! చంద్రబాబు భారీ ప్లాన్! Ration Card: రేషన్ కార్డుదారులకు భారీ షాక్! ఒక్కసారిగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు! Ganja Seized: నూజివీడులో షాకింగ్ ఘటన! ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న మహిళ! AP E6 Road: షాకింగ్ రియాలిటీ.. రెండే నెలల్లో గ్రావెల్ రోడ్డు నుంచి తారు రోడ్డుగా మారిన E6 రహదారి! మాస్టర్ ప్లాన్ అమల్లోకి.. New Railway Line: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.2,200 కోట్లతో కొత్త రైల్వే లైన్... ఎన్నో ఏళ్ల కల! AP Govt: ప్రతి ఇంటికీ 'మహాశక్తి'గా ఆడబిడ్డలు ఎదగాలి..! నారా లోకేష్ సందేశం! Operation Vajraprahar: విజయవాడలో ఆపరేషన్ వజ్రప్రహార్: పోలీసుల మెరుపు తనిఖీలు! పట్టుబడ్డ ముఠా.... Asset Case: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు! టౌన్ ప్లానింగ్ మాజీ అధికారి నివాసంలో సోదాలు...! Inner Ring Road: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆ 15 గ్రామాలకు మహర్దశ! Mega Project: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... రూ. 20,000 కోట్లతో మెగా ప్రాజెక్ట్... అక్కడే ఫిక్స్!! National Highway: ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి... 7 నేషనల్ హైవేలతో అనుసంధానం! చంద్రబాబు భారీ ప్లాన్! Ration Card: రేషన్ కార్డుదారులకు భారీ షాక్! ఒక్కసారిగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు! Ganja Seized: నూజివీడులో షాకింగ్ ఘటన! ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న మహిళ! AP E6 Road: షాకింగ్ రియాలిటీ.. రెండే నెలల్లో గ్రావెల్ రోడ్డు నుంచి తారు రోడ్డుగా మారిన E6 రహదారి! మాస్టర్ ప్లాన్ అమల్లోకి.. New Railway Line: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.2,200 కోట్లతో కొత్త రైల్వే లైన్... ఎన్నో ఏళ్ల కల! AP Govt: ప్రతి ఇంటికీ 'మహాశక్తి'గా ఆడబిడ్డలు ఎదగాలి..! నారా లోకేష్ సందేశం! Operation Vajraprahar: విజయవాడలో ఆపరేషన్ వజ్రప్రహార్: పోలీసుల మెరుపు తనిఖీలు! పట్టుబడ్డ ముఠా.... Asset Case: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు! టౌన్ ప్లానింగ్ మాజీ అధికారి నివాసంలో సోదాలు...!

Ration Card: రేషన్ కార్డుదారులకు భారీ షాక్! ఒక్కసారిగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు!

Ration Card: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని రకాల సేవా రుసుంలను భారీగా పెంచింది. గతంలో రూ. 24 గా ఉన్న సాధారణ సేవల ధర రూ. 100 కి, కార్డు విభజన రుసుము రూ. 48 నుంచి రూ. 200 కి చేరింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే, ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు తక్కువ ధరకు గోధుమ పిండిని కూడా అందిస్తోంది.

Published : 2026-03-08 15:38:00

సభ్యుల చేర్పు, తొలగింపుకు భారీగా సేవా రుసుం…

రేషన్ కార్డు సేవలపై అదనపు భారం…

రేషన్ వ్యవస్థలో భారీ మార్పులు…

Ration Card: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు (రైస్ కార్డ్) కలిగి ఉన్న కోట్లాది మంది సామాన్య ప్రజలకు కూటమి ప్రభుత్వం ఒక షాకింగ్ వార్తను అందించింది. రేషన్ కార్డులకు సంబంధించిన వివిధ రకాల సేవలపై సర్వీస్ ఛార్జీలను (సేవా రుసుంలను) భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న రుసుంలను ఒకేసారి నాలుగైదు రెట్లు పెంచడంతో సామాన్యుల బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది. ఈ సవరించిన కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, సభ్యుల పేర్ల చేర్పు లేదా తొలగింపు వంటి సాధారణ సేవల ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. గతంలో ఈ తరహా సేవలకు కేవలం రూ. 24 మాత్రమే రుసుముగా ఉండగా, దానిని ఇప్పుడు ఏకంగా రూ. 100 కి పెంచారు. అంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. డూప్లికేట్ రైస్ కార్డ్ పొందడం, చిరునామా మార్పు, వివరాల సవరణ వంటి పనుల కోసం వెళ్లే భక్తులు కూడా ఇకపై రూ. 100 చెల్లించాల్సిందే. ఇది పేద మరియు మధ్యతరగతి వర్గాలకు మింగుడుపడని విషయమని చెప్పవచ్చు.

కార్డు విభజన (Splitting of Card) వంటి సేవల విషయంలో బాదుడు ఇంకా ఎక్కువగా ఉంది. గతంలో రైస్ కార్డు విభజన కోసం రూ. 48 మాత్రమే వసూలు చేసేవారు, కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ రుసుమును రూ. 200 కి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య విభజనలు వచ్చినప్పుడు లేదా కొత్తగా పెళ్లైన వారు వేరుగా కార్డు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ అదనపు భారం తప్పదు. మీసేవ కేంద్రాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, సిటిజన్ పోర్టల్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ వంటి అన్ని విభాగాల ద్వారా అందజేసే సేవలకూ ఈ పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి.

ప్రభుత్వం ఈ ధరల పెంపును సమర్థిస్తూనే, రేషన్ వ్యవస్థలో కొన్ని కీలకమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన అత్యాధునిక స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాగే రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం, పంచదార మాత్రమే కాకుండా రాగులు, జొన్నలు మరియు గోధుమ పిండి వంటి పోషకాహారాలను కూడా అందజేస్తోంది. ముఖ్యంగా మార్కెట్‌లో కిలో రూ. 70 వరకు ఉన్న గోధుమ పిండిని కేవలం రూ. 20 కే అందిస్తూ పేదలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది.
 

Spotlight

Read More →