Ganja Seized: నూజివీడులో షాకింగ్ ఘటన! ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న మహిళ! AP E6 Road: షాకింగ్ రియాలిటీ.. రెండే నెలల్లో గ్రావెల్ రోడ్డు నుంచి తారు రోడ్డుగా మారిన E6 రహదారి! మాస్టర్ ప్లాన్ అమల్లోకి.. New Railway Line: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.2,200 కోట్లతో కొత్త రైల్వే లైన్... ఎన్నో ఏళ్ల కల! AP Govt: ప్రతి ఇంటికీ 'మహాశక్తి'గా ఆడబిడ్డలు ఎదగాలి..! నారా లోకేష్ సందేశం! Operation Vajraprahar: విజయవాడలో ఆపరేషన్ వజ్రప్రహార్: పోలీసుల మెరుపు తనిఖీలు! పట్టుబడ్డ ముఠా.... Asset Case: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు! టౌన్ ప్లానింగ్ మాజీ అధికారి నివాసంలో సోదాలు...! International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం: రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు! Women Welfare: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! సాధికారతకు ఏపీలో సరికొత్త బాటలు...! Milk Scam: రాజమండ్రి కల్తీ పాల మరణాల మిస్టరీ వీడింది! ఫోరెన్సిక్ రిపోర్టులో భయంకర నిజాలు! Statue Of Sacrifice: మార్చి 16న 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు! Ganja Seized: నూజివీడులో షాకింగ్ ఘటన! ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న మహిళ! AP E6 Road: షాకింగ్ రియాలిటీ.. రెండే నెలల్లో గ్రావెల్ రోడ్డు నుంచి తారు రోడ్డుగా మారిన E6 రహదారి! మాస్టర్ ప్లాన్ అమల్లోకి.. New Railway Line: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.2,200 కోట్లతో కొత్త రైల్వే లైన్... ఎన్నో ఏళ్ల కల! AP Govt: ప్రతి ఇంటికీ 'మహాశక్తి'గా ఆడబిడ్డలు ఎదగాలి..! నారా లోకేష్ సందేశం! Operation Vajraprahar: విజయవాడలో ఆపరేషన్ వజ్రప్రహార్: పోలీసుల మెరుపు తనిఖీలు! పట్టుబడ్డ ముఠా.... Asset Case: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు! టౌన్ ప్లానింగ్ మాజీ అధికారి నివాసంలో సోదాలు...! International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం: రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు! Women Welfare: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! సాధికారతకు ఏపీలో సరికొత్త బాటలు...! Milk Scam: రాజమండ్రి కల్తీ పాల మరణాల మిస్టరీ వీడింది! ఫోరెన్సిక్ రిపోర్టులో భయంకర నిజాలు! Statue Of Sacrifice: మార్చి 16న 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు!

Middle East War Impact: గల్ఫ్ యుద్ధం సెగ.. కుదేలవుతున్న తెలుగు రాష్ట్రాల ఆక్వా, పౌల్ట్రీ రంగాలు!

Middle East War Impact: మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆక్వా పౌల్ట్రీ రంగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

Published : 2026-03-08 13:23:00

Telugu States Farmers Crisis:  ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తెలుగు రాష్ట్రాల రైతుల వెన్ను విరుస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న పోరు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆక్వా, పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సముద్రపు ఆహార ఉత్పత్తులు  కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది. ఎగుమతిదారులు పంపుతున్న సరుకు మధ్యలోనే ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

నట్టేట మునుగుతున్న ఆక్వా రవాణా

ఆంధ్రప్రదేశ్ నుండి గల్ఫ్ దేశాలకు  ఐరోపాకు వెళ్లాల్సిన సుమారు 300 మిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ కంటైనర్లు ప్రస్తుతం రేవుల్లోనే చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రం మార్గంలో ప్రయాణించేందుకు షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. దీనివల్ల విదేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల నిల్వలు పెరిగిపోతున్నాయి. మరోవైపు, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఒక్కో కంటైనర్‌పై సుమారు 1,500 నుండి 4,000 డాలర్ల వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఎగుమతిదారులకు భారీ నష్టాలు తప్పడం లేదు.

కలవరపెడుతున్న రొయ్యల ధరల పతనం

విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల సాగుదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. కోల్డ్ స్టోరేజీలు ఇప్పటికే సరుకుతో నిండిపోవడంతో, స్థానిక వ్యాపారులు రైతుల నుండి కొత్తగా కొనుగోళ్లు చేయడం ఆపేశారు. దీనివల్ల స్థానిక మార్కెట్‌లో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఇప్పటికే రొయ్యలపై పన్నులు పెంచిన తరుణంలో, ఇప్పుడు ఈ యుద్ధం వచ్చి పడటం ఆక్వా రంగానికి కోలుకోలేని దెబ్బగా మారింది.

తెలంగాణ పౌల్ట్రీకి కోడిగుడ్డు సెగ

తెలంగాణలో పౌల్ట్రీ రంగం పరిస్థితి కూడా ఇదే. గల్ఫ్ దేశాలకు ప్రతిరోజూ లక్షలాది కోడిగుడ్లు ఇక్కడి నుండి ఎగుమతి అవుతుంటాయి. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు, షిప్పింగ్ నిలిచిపోవడంతో గుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. ఎగుమతి కావాల్సిన గుడ్లన్నీ స్థానిక మార్కెట్‌కు మళ్లించడంతో సరఫరా పెరిగి ధరలు పడిపోతున్నాయి. దీనివల్ల పౌల్ట్రీ రైతులు ప్రతిరోజూ కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. హలాల్ మాంసం ఎగుమతులపై కూడా ఇదే ప్రభావం పడుతోంది.

ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు

యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని ప్రభావం వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయని తెలుగు రాష్ట్రాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న భయం ఒకవైపు ఉంటే, తామ సరుకు అమ్ముడుపోక పోవడం మరో ఇబ్బందిగా మారింది. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రవాణా మార్గాలను సుగమం చేయడంతో పాటు, నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Spotlight

Read More →