Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి!

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. దేశంలో ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే ‘బిజినెస్ రీఫా

Published : 2025-12-18 12:40:00
Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. దేశంలో ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలే ఈ అవార్డుకు ప్రధాన కారణంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈ గౌరవం దక్కిందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!

ఈ ప్రతిష్టాత్మక అవార్డును మార్చి నెలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. దేశ ఆర్థిక రంగంలో అత్యంత గౌరవనీయంగా భావించే ఈ అవార్డు ఎంపిక ప్రక్రియను అత్యున్నత స్థాయి జ్యూరీ నిర్వహించింది. ఈ జ్యూరీలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలు సభ్యులుగా ఉండటం ఈ అవార్డు ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సాంకేతిక సలహాదారుగా వ్యవహరించింది.

10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి దేశంలోని అగ్రశ్రేణి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఇంతటి విశిష్ట వ్యక్తులతో కూడిన జ్యూరీ సీఎం చంద్రబాబును ఎంపిక చేయడం ఆయన నాయకత్వానికి జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

ఈ అవార్డును గతంలో పలువురు ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు అందుకున్నారు. 2024లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, 2023లో ఎస్. జైశంకర్, 2021లో నిర్మలా సీతారామన్, 2019లో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్, 2017లో అరుణ్ జైట్లీ, 2015లో పీయూష్ గోయల్ వంటి ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు చేరడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా మారింది. ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు, రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 

త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..
Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!
Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు
Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా?
Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!
AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!

Spotlight

Read More →