Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Dwakra Womens: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్..! తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి ₹4 లక్షల లాభం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో

Published : 2025-11-17 10:04:00
క్రెడిట్ స్కోర్ 750+ ఉన్నా లోన్ ఎందుకు రావట్లేదో తెలుసా? ప్రధాన కారణాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో, తాజాగా డ్వాక్రా మహిళలకు కొత్త ఆదాయ మార్గాన్ని చూపుతూ కొర్రమీను చేపల పెంపకాన్ని ప్రొత్సహిస్తోంది. తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో, తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు వచ్చే ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలు సంవత్సరానికి రూ.3–4 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్థిర ఆదాయాన్ని సంపాదించి ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించగా, బ్యాంకుల సహకారంతో రుణాలు అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఈ చేపల పెంపకం డ్వాక్రా మహిళల కోసం ఆర్థిక స్వావలంబనకు కొత్త అధ్యాయంగా మారవచ్చని అధికారులు భావిస్తున్నారు.

US huge: మిరియాలు నుంచి మామిడివరకు.. భారత ఎగుమతులకు US భారీ ఊరట!

ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే—సర్కిలేటరీ విధానంలో చేపలను పెంచడం. ఈ విధానంలో నీటి వినియోగం చాలా తక్కువగా ఉండటంతో నీటి వృథా పూర్తిగా తగ్గిపోతుంది. చిన్న సింథటిక్ లేదా ఫైబర్ చెరువుతో పాటు ఒక పెద్ద చెరువును ఏర్పాటు చేస్తే సరిపోతుంది. దీనికి సుమారు పది సెంట్ల స్థలం చాలు. గ్రామాల్లో తక్కువ భూమి ఉన్న మహిళలు కూడా ఈ విధానం ద్వారా చేపల పెంపకం చేయగలరు. కొర్రమీను చేపలు వేగంగా పెరిగే రకం కావడంతో, ఎనిమిది నెలల్లోనే మార్కెటింగ్‌కు సిద్ధమవుతాయి. ముందుగా 10–20 గ్రాముల పిల్లలను నాలుగు నెలలు చిన్న చెరువులో పెంచి, ఆ తరువాత మరో నాలుగు నెలలు పెద్ద చెరువులో పెంచితే ఒక్కో చేప కిలో వరకు బరువు పెరుగుతుంది. చేపల పెంపకం సైంటిఫిక్ విధానంలో జరిగేలా మహిళలకు సమగ్ర శిక్షణ కూడా అందిస్తామని అధికారులు తెలిపారు.

Saudi Accident: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం! 42 మంది భారతీయులు దుర్మరణం!

ఈ ప్రాజెక్టుకు మొత్తం పెట్టుబడి దాదాపు రూ.1,27,000 మాత్రమే. దీనిలో చేపల పిల్లలు రూ.15,000, మేతకు రూ.1,12,000 ఖర్చవుతుంది. పెంపకం పూర్తయ్యాక దాదాపు 935 కిలోల చేపలు ఉత్పత్తి అవుతాయి. వీటిని మార్కెట్‌లో కిలో రూ.280కి అమ్మితే రూ.2,49,536 ఆదాయం వస్తుంది. అంటే పెట్టుబడి తీసేసి రూ.1,22,536 వరకు నికర లాభం వస్తుంది. ముఖ్యంగా, ఈ పెంపకాన్ని ఏడాదిలో మూడుసార్లు చేయవచ్చన్నది ఈ ప్రాజెక్టు ఆకర్షణ. అంటే సంవత్సరానికి దాదాపు రూ.3.5–4 లక్షల వరకు లాభం వస్తుంది. ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో మహిళలు ఈ ప్రాజెక్టులో ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు.

Rice crop: తుఫాన్‌కే తలవంచని ఆర్‌జీఎల్‌ 7034..! బీపీటీకి బ్లాస్ట్ ప్రత్యామ్నాయంగా కొత్త వరి రకం..!

ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ఉదయ్ ఆక్వా సంస్థ కూడా ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. వారు మహిళలకు చేపల పెంపకానికి సంబంధించిన సలహాలు, మార్గదర్శకాలు ఇవ్వడం మాత్రమే కాకుండా, వాటిని పూర్తయిన తర్వాత నేరుగా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో మార్కెటింగ్‌లో వచ్చే సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. మహిళలు తమ ఉత్పత్తులను స్వయంగా అమ్ముకునే అవకాశమూ ఉంటుంది. తక్కువ స్థలం, తక్కువ ఖర్చు, అధిక లాభాలు—ఈ మూడు ప్రయోజనాలు కలిసివచ్చే ఈ కొర్రమీను చేపల పెంపక ప్రాజెక్టు డ్వాక్రా మహిళలకు నిజమైన వరంగా మారనుంది. గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Bihar Politics: బీహార్ ఫలితాల తరువాత లాలూ కుటుంబంలో కలకలం.. సోదరిపై చెప్పు విసిరేసిన తేజస్వీ !!
Gold Rates Down: ఊహించిన విధంగా భారీగా తగ్గిన బంగారం ధరలు! ఇదే మంచి ఛాన్స్....
Srivarai Darshanam: తిరుమలలో ఫ్యామిలీ మొత్తానికి వీఐపీ దర్శనం! మీకు కావాలా.. ఇలా చేస్తే చాలు!
ఏపీలో కొత్తగా ఎన్‌టీపీసీ అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌? రూ.20,000 కోట్లతో... ఆ నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం!
Praja Vedika: నేడు (17/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఆ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్! బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే...ఎన్ని కేజీలైన తీసుకెళ్లొచ్చు!

Spotlight

Read More →