Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం! Indian Railways: మే 12 నుండి గుంతకల్లు - మార్కాపూర్ రైలు పునఃప్రారంభం! Royal Enfield AP: రూ. 2,503 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడి! 3,000 మందికి ఉద్యోగాలు... Bullet Train: బుల్లెట్ ట్రైన్ల హబ్ గా మారనున్న ఆంధ్రప్రదేశ్.. మూడు వైపులా హైస్పీడ్ ట్రాకులు! కేంద్రం గ్రీన్ సిగ్నల్! AP Investments: ఏపీకి లక్ష కోట్ల భారీ పెట్టుబడి! 600 ఎకరాలు.. ఈనెల 15 న ముహూర్తం ఫిక్స్! Solar Power Plant: ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. రూ.51 వేలకోట్లతో సోలార్ పవర్ ప్లాంట్!! Chandrababu: రాష్ట్రంలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం.. రాబోయే సాగు సీజన్‌పై ప్రభుత్వం క్లారిటీ! Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం! Indian Railways: మే 12 నుండి గుంతకల్లు - మార్కాపూర్ రైలు పునఃప్రారంభం! Royal Enfield AP: రూ. 2,503 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడి! 3,000 మందికి ఉద్యోగాలు... Bullet Train: బుల్లెట్ ట్రైన్ల హబ్ గా మారనున్న ఆంధ్రప్రదేశ్.. మూడు వైపులా హైస్పీడ్ ట్రాకులు! కేంద్రం గ్రీన్ సిగ్నల్! AP Investments: ఏపీకి లక్ష కోట్ల భారీ పెట్టుబడి! 600 ఎకరాలు.. ఈనెల 15 న ముహూర్తం ఫిక్స్! Solar Power Plant: ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. రూ.51 వేలకోట్లతో సోలార్ పవర్ ప్లాంట్!! Chandrababu: రాష్ట్రంలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం.. రాబోయే సాగు సీజన్‌పై ప్రభుత్వం క్లారిటీ!

Chandrababu: జిల్లాల వారీ సమీక్షలు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. అభివృద్ధి పనులపై స్పష్టమైన దిశానిర్దేశం!

Chandrababu: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను పూర్తి చేశారు.

Published : 2026-05-07 10:09:00

3 నెలల్లో 28 జిల్లాల ప్రతినిధులతో సమీక్షలు చేపట్టిన సీఎం చంద్రబాబు..

జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష..

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడు నెలలుగా నిర్వహించిన జిల్లాల వారీ సమీక్షలను పూర్తి చేశారు. ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లాతో ప్రారంభమైన ఈ సమీక్షల పరంపర తాజాగా విశాఖపట్నం జిల్లాతో ముగిసింది. మొత్తం 28 జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం విస్తృతంగా చర్చలు జరిపారు.

ఈ సమీక్షల్లో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం వెయ్యికి పైగా సమస్యలు వివిధ జిల్లాల నుంచి ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వాటిలో అత్యవసరమైన అంశాలపై అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఆర్థిక వ్యయం అవసరం లేని పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సమన్వయం చేసి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమీక్షల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు నివేదికలు స్వీకరించినట్లు సమాచారం. ప్రజలతో మమేకమై పనిచేయాలని, పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రజల్లో వివాదాలకు దారి తీసే అంశాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది.

కూటమి ప్రభుత్వంలో భాగమైన పార్టీల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు సూచించే స్థానిక సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇక అధికారుల పనితీరుపైనా సీఎం సూక్ష్మస్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించే విధంగా పాలన ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని సూచించారు. ఈ జిల్లాల వారీ సమీక్షలు ప్రభుత్వ పనితీరుకు కొత్త దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Spotlight

Read More →