LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  •  Health Tips: వీటిలో వాటర్ తాగుతున్నారా... అయితే వాటిని కొనితెచ్చుకున్నట్లే!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు!

AP Ration Card Updates: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేరిక, పేర్ల తొలగింపు, తప్పుల సవరణ వంటి 9 రకాల సేవలను మీసేవ కేంద్రాల్లోనే పొందవచ్చు.

AndhraPravasi News Desk 1 min read
AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు!

AP Ration Card Updates: రేషన్ కార్డు వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై కార్డులో పేర్లు మార్చుకోవాలన్నా, కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఉండే 'మీసేవ' కేంద్రాల్లోనే ఈ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేయాలంటే కేవలం సచివాలయాల ద్వారానే సాధ్యమయ్యేది. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. మొత్తం తొమ్మిది రకాల సేవలను మీసేవ కేంద్రాల పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల పనుల వేగం పెరగడమే కాకుండా, ప్రజలకు సమయం కూడా ఆదా అవుతుంది.

ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన మహిళలు తమ పుట్టింటి కార్డు నుంచి పేరు తొలగించి, అత్తగారి ఇంటి కార్డులో పేరు చేర్చుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి పేరు తొలగించడం, ఆధార్ కార్డు లింక్ చేయడం, తప్పుగా ఉన్న వివరాలను సరిదిద్దడం వంటి పనులన్నీ మీసేవలో చేసుకోవచ్చు. అయితే కొత్త కార్డుల జారీ  కార్డు విభజన (స్ప్లిట్) వంటి సేవలు మాత్రం ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సేవలు పొందాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్త సభ్యులను చేర్చాలంటే ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రిక వంటివి అవసరమవుతాయి. వివరాల మార్పు కోసం విద్యా ధృవీకరణ పత్రాలు కూడా అడిగే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మీసేవ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు ప్రజలు, ఇటు మీసేవ కేంద్రాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్ళీ అందుబాటులోకి రావడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. మీకు కూడా రేషన్ కార్డులో ఏవైనా సవరణలు ఉంటే, వెంటనే మీ దగ్గరలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని వాడుకోండి.

Be the first to react

More Coverage

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

Nara Lokesh: ఆధారాలతో సహా జగన్ అబద్ధాలను నిరూపించాం.. డీఎస్సీ వివాదంపై మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్!

మాజీ ముఖ్యమంత్రి జగన్ డీఎస్సీ విషయంలో తప్పుడు ప్రచారం చేసి, అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని, దీనికి…