Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! New Airport: శంషాబాద్ తర్వాత రెండో పెద్ద హబ్... ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో మారనున్న తెలంగాణ ఫేస్! Modi In UAE: మోదీ యూఏఈ పర్యటన... నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు! Prajadarbar: వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వెబ్‌ల్యాండ్ నుండి భూమి తొలగింపుపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! విజయవాడలో వడ్డీ వ్యాపారి దౌర్జన్యం.. Weavers: అంపశయ్యపై ఉన్న చేనేతకు కూటమి ప్రభుత్వం ఊపిరి! నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు! TDP: గత ప్రభుత్వం వ్యాపారులను వేధించింది.. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది! Amit Shah: రూ.182 కోట్ల క్యాప్టగాన్ డ్రగ్‌ స్వాధీనం.. “ఆపరేషన్ రేజ్‌పిల్”లో భారీ విజయం!

Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్!

Electricity: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Published : 2026-05-17 11:12:00

కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకూ కరెంట్ ఛార్జీల పెంపు లేదు..

యూనిట్‌కు రూపాయి తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి యూనిట్‌పై కనీసం రూపాయి మేర ఛార్జీలు తగ్గించాలని సీఎం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని వెల్లడించారు.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో “ట్రూఅప్” పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజలపై భారం మోపకుండా “ట్రూడౌన్” విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఆంధ్రప్రదేశ్‌కు 20 లక్షల “సూర్యఘర్” కనెక్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. దీని ద్వారా సాధారణ కుటుంబాలు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అవసరానికి అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

విద్యుత్ రంగంలో సంస్కరణలు, పునరుత్పాదక శక్తికి ప్రోత్సాహం, ప్రజలపై అదనపు భారం లేకుండా సేవలు అందించడం ద్వారా రాష్ట్రాన్ని శక్తి పరంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

Spotlight

Read More →