Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SEZ: సెజ్ రైతుల సమస్యలపై మంత్రి కీలక ప్రకటన! టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం! AP Tourism: వట్టిచెరుకూరులో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు...! కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని! Divwela Madhuri: తిరుమలలో దివ్వెల మాధురి హల్‌చల్.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు! Srikanth Case: శ్రీకాంత్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్... దగదర్తిలో నోటీసుల కలకలం! Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Talliki Vandanam: తల్లికి వందనంపై లేటెస్ట్ అప్‌డేట్! వారికి కూడా తల్లికి వందనం.. ప్రభుత్వం కీలక ప్రకటన! Steel Plant: ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం... రూ.1.35 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్! మార్చి 23 న శంకుస్థాపన! Anna Canteens: ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు..! ఉగాది నుంచి పేదలకు పౌష్టికాహారం! RTC Depots: ఏపీలో వారికి శుభవార్త! కొత్తగా రెండు RTC డిపోలు...100 ఎలక్ట్రిక్ బస్సులు! SEZ: సెజ్ రైతుల సమస్యలపై మంత్రి కీలక ప్రకటన! టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకారం! AP Tourism: వట్టిచెరుకూరులో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు...! కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్! AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! డిప్యూటీ కలెక్టర్‌గా టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని! Divwela Madhuri: తిరుమలలో దివ్వెల మాధురి హల్‌చల్.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు! Srikanth Case: శ్రీకాంత్ హత్యాయత్నం కేసులో ట్విస్ట్... దగదర్తిలో నోటీసుల కలకలం! Railway Station: ప్రయాణికులకు శుభవార్త! ఎయిర్పోర్ట్ లుక్కులో ఆ రైల్వే స్టేషన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే!

AP Development Growth: చంద్రబాబు విజన్‌కు అందరూ అండగా ఉండాలి.. 11.75 శాతం వృద్ధి రేటే మన లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..!!

AP Development Growth: గత వైసీపీ ప్రభుత్వం చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పుల వల్ల రాష్ట్రం ఎలా దెబ్బతిన్నదో వివరిస్తూ, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గణాంకాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు

Published : 2026-03-06 12:24:00

AP Development Growth: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే, అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసి రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేశారని ఆయన మండిపడ్డారు. అయినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే   రాష్ట్ర ప్రగతిని మళ్ళీ పట్టాలెక్కించేందుకు నీటిపారుదల, రోడ్లు భవనాలు వంటి కీలక శాఖల కోసం ఇప్పటికే 37 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని పవన్ కల్యాణ్ వివరించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వారు పక్కదారి పట్టించారని పవన్ ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పనుల విషయంలో గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 610 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే 3,753 కోట్ల రూపాయలు వెచ్చించిందని గణాంకాలతో సహా వివరించారు. ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

రోడ్ల నిర్మాణ రంగంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 854 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేశారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో 6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల పనులను పూర్తి చేసిందని ఆయన గర్వంగా ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడిందని, ఆ గాడి తప్పిన వ్యవస్థలను బాగు చేసేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఈ కూటమి ఏర్పాటు కోసం తాను ఎంతో శ్రమించానని, ఈ బంధం ఇలాగే బలంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం గతంలో 11.75 శాతం వృద్ధి రేటును సాధించిందని, ఇప్పుడు కూడా అదే స్థాయి అభివృద్ధిని సాధించేందుకు అందరూ ఆయనకు అండగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు. కూటమిలోని నాయకులందరూ ఒకే తాటిపై ఉండి, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వం న్యాయశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కోర్టు విచారణల ప్రక్రియలో ఆధునిక సాంకేతికతను జోడించి ఆన్‌లైన్ విధానాన్ని మరింతగా పెంచాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. పరిపాలనలోపారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి పైసా ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →