- నిన్న పార్టీలో చేరిన పలుకూరు వైసిపి నేతలు.. నేడు అదే బాటలో ఎనకండ్ల గ్రామ వైసీపీ క్యాడర్..
- చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్..
- రాష్ట్రంలోనే బనగానపల్లెను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మంత్రి..
YSRCP Shock in Banaganapalle: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన సుపరిపాలన వైసీపీ క్యాడర్ ను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది.. గత కొద్ది కాలంగా బనగానపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు.. నిన్న పలుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తాజాగా నేడు ఎనకండ్ల గ్రామానికి చెందిన స్థానిక వైసీపీ నేతలు టీడీపీలో చేరడం జరిగింది..
నేడు బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఎనకండ్ల గ్రామ వైసిపి నేతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా కోడూరు రామచంద్రారెడ్డి, బీసీ మద్దిలేటి రెడ్డి, కృష్ణారెడ్డి, పాపసాని గోపాల్ రెడ్డి, కోడూరు వెంకట సుబ్బారెడ్డి, ఆర్ రామేశ్వరరెడ్డి, బీసీ మధుసూధన్ రెడ్డి తదితరులకు తెలుగుదేశం జెండాను కప్పి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి నచ్చి తాము తెలుగుదేశం పార్టీలోకి రావడానికి జరిగిందని నూతనంగా చేరిన నేతలు తెలిపారు.. ముఖ్యంగా గత 20 నెలల పాలనలో బనగానపల్లెలో కనివిని రీతిలో అభివృద్ధి జరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.. బనగానపల్లె ను రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేస్తున్న కృషి, తపన నచ్చి తామంతా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందన్నారు..
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గుర్తించి తమతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన నేతలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలిపారు.. కొత్తగా పార్టీలో చేరిన నేతలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా ఏకతాటి పైకి వచ్చి తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలన్నారు.. కొత్తగా పార్టీలో చేరిన నేతలను కలుపుకొని ముందుకు సాగాలని పార్టీ సీనియర్ నేతలకు మంత్రి సూచించారు.