Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్ మంటల్లో 20 మంది సజీవ దహనం! weather update: ఐఎండీ బిగ్ అలర్ట్.. 18 జిల్లాలకు 'ఆరెంజ్' వాతావరణ హెచ్చరిక! రాబోయే రెండు రోజులు.. Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Mobile Tips: మీ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో ఈ మార్పులు చేయండి... 5G వేగాన్ని అందుకోండి! Germany: భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్.. ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిన సరికొత్త వీసా మినహాయింపు! Pooja Hegde: వరుస ప్రాజెక్టులతో పూజా హెగ్డే జోష్.. త్వరలోనే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'తో టాలీవుడ్ టు బాలీవుడ్! TTA: టీటీఏ మెగా కన్వెన్షన్-2026కు ముమ్మర సన్నాహాలు..యువత కోసం ప్రత్యేక యూత్ కమిటీ ఏర్పాటు! Road Accident: ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. వైజాగ్‌లో తీవ్ర గాయాలు! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! Tariffs: భారత్ సహా 54 దేశాలపై అమెరికా పన్నుల అస్త్రం... 12.5 శాతం అదనపు భారం!! Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్ మంటల్లో 20 మంది సజీవ దహనం! weather update: ఐఎండీ బిగ్ అలర్ట్.. 18 జిల్లాలకు 'ఆరెంజ్' వాతావరణ హెచ్చరిక! రాబోయే రెండు రోజులు.. Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Mobile Tips: మీ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో ఈ మార్పులు చేయండి... 5G వేగాన్ని అందుకోండి! Germany: భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్.. ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిన సరికొత్త వీసా మినహాయింపు! Pooja Hegde: వరుస ప్రాజెక్టులతో పూజా హెగ్డే జోష్.. త్వరలోనే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'తో టాలీవుడ్ టు బాలీవుడ్! TTA: టీటీఏ మెగా కన్వెన్షన్-2026కు ముమ్మర సన్నాహాలు..యువత కోసం ప్రత్యేక యూత్ కమిటీ ఏర్పాటు! Road Accident: ‘ఢీ’ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. వైజాగ్‌లో తీవ్ర గాయాలు! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! Tariffs: భారత్ సహా 54 దేశాలపై అమెరికా పన్నుల అస్త్రం... 12.5 శాతం అదనపు భారం!!

Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి!

Palnadu: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

Published : 2026-06-03 12:54:00

40 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ముస్లిం కుటుంబం ఆరోపణలు..

బయటపడుతున్న బొల్లా భూ వివాదాలు.. న్యాయం కోరుతున్న బాధితులు..

పల్నాడు: పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా వినుకొండలో మరో భూమి ఆక్రమణ వ్యవహారం బయటపడింది.

వినుకొండకు చెందిన ఓ ముస్లిం కుటుంబం తమ 40 సెంట్ల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో బొల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించింది. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అధికారాన్ని ఉపయోగించి తమను బెదిరింపులకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

భూమి విషయంలో అప్పట్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అధికార ఒత్తిళ్ల కారణంగా తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దీంతో ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి రావడంతో బాధిత కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమ గోడును వినిపించింది. తమ భూమిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ భూ వివాదంపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాలని స్థానికులు కూడా కోరుతున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Spotlight

Read More →