తెలుగు వెలుగు జర్మనీ సంఘం ఆధ్వర్యంలో ఉగాది, తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఏప్రిల్ 6న ఫ్రాంక్ఫర్ట్ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఫ్రాంక్ఫర్ట్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు పాల్గొని, సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.
ఈ సందర్భంగా సంఘం సంస్థాపకుడు మరియు మాజీ చైర్మన్ Late శ్రీ సాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా స్మరించుకొని, ఆయన కలలు, ఆశయాలు ఇప్పటికీ తెలుగు వెలుగు సభ్యుల నడకదారిలో వెలుగులా నిలుస్తున్నాయని జనరల్ సెక్రెటరి శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు పేర్కొన్నారు. "ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన చూపిన దారి మాకొక దిక్సూచి. ఆయన స్వప్నాన్ని నెరవేర్చే బాధ్యతను మేము అందరం మోస్తాం," అని ఆయన అన్నారు.
ఈ వేడుకకు ఫ్రాంక్ఫర్ట్ బర్గర్మాస్టర్ శ్రీమతి నసరిన్ ఎస్కందారి-గ్ర్యూన్బర్గ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, జర్మనీలో తెలుగు సమాజానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. బహుళసాంస్కృతిక సమాజాన్ని ప్రోత్సహించడంలో ఫ్రాంక్ఫర్ట్ నగరం చేస్తున్న కృషికి తెలుగు వెలుగు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: ఎయిర్పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!
శ్రీ సూర్యప్రకాశ్ వెలగా గారు, ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫ్రాంక్ఫర్ట్ ప్రాంతంలో తెలుగు సమాజానికి అందుతున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు కమ్యూనిటీ ఇటీవల వేగంగా ఎదుగుతుందని, కొత్తగా చేరిన కుటుంబాలను మన తెలుగు వెలుగు కుటుంబంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
"ఇలాంటి వేడుకలు మనందరినీ కలిపి, ఒకరికొకరు తెలుసుకునే వేదికగా నిలుస్తాయి. మన ఐక్యతే మన బలం," అని అన్నారు.
ఈ ఉగాది సంబరాల్లో పిల్లలు, యువత మరియు కళాకారులు అందించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని విజయవంతం చేయడంలో సంఘం కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రీతం బొడా విట్టల్ గారు తమ అంకితభావంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే సంఘం ట్రెజరర్ శ్రీ ఆదర్శ్ వంగల గారు సంఘం ఆర్థిక పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈవెంట్ విజయవంతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: దినదిన గండంగా మారిన అమెరికా.. దారుణ పరిస్థితిలో తెలుగు విద్యార్థులు.! చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష ..