International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు! International news: వ్యవసాయం నుంచి ఇంధనం వరకు… ట్రంప్–జిన్‌పింగ్ చర్చలు ఆర్థిక సహకారానికి కొత్త పునాది! Jamaica Cyclone news : భీకర తుపాను ప్రభావంతో చీకటి కమ్మేసిన దేశం… చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం! గంటకు 295 కి.మీ. వేగంతో ప్రళయం తలపించే దృశ్యాలు! LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్!

2025-11-03 08:00:00
మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు?

ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. ముఖ్యంగా అధిక రక్తపోటు భయంతో ఉప్పు లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే, ఇది శరీరానికి మేలు కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది. ఉప్పు కేవలం రుచికోసమే కాదు, శరీరానికి అవసరమైన ఖనిజాలు అందించే ముఖ్యమైన పదార్థం. ఇందులోని సోడియం, క్లోరైడ్‌లు శరీరంలోని ప్రతి కణానికి శక్తిని అందించడంలో, జీవక్రియ సక్రమంగా నడపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Jemimah Rodrigues: రోహిత్ శర్మ మాటలే నాకు స్ఫూర్తి.. జెమీమా రోడ్రిగ్స్!

ఉప్పు లేకుండా ఒక నెల జీవిస్తే మొదట గమనించే మార్పు శరీర శక్తి తగ్గడం. సోడియం లోపం వల్ల ‘హైపోనాట్రేమియా’ అనే పరిస్థితి వస్తుంది. ఇది కణాల్లో ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. దాంతో కండరాలు, మెదడు సరైన శక్తిని పొందలేవు. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట, బలహీనత, నిద్రాహారం కలగడం వంటి సమస్యలు వస్తాయి.

Palnadu Amaravathi: శరవేగంగా సాగుతున్న పల్నాడు.. అమరావతి రహదారి విస్తరణ పనులు!

తదుపరి సమస్య రక్తపోటు పతనం. ఉప్పు మానేయడం వల్ల రక్తనాళాల్లో నీరు నిలవకపోవడంతో రక్త పరిమాణం తగ్గి రక్తపోటు పడిపోతుంది. ఇది ‘హైపోటెన్షన్’ అనే ప్రమాదకర స్థితిని కలిగిస్తుంది. తలనొప్పి, తలతిరుగుడు, కళ్లు బైర్లు కమ్మడం, తీవ్రమైన సందర్భాల్లో స్పృహ కోల్పోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు.

IRCTC Updates: నవంబర్ 1 నుంచి IRCTC కొత్త రూల్స్.. వారికి లోయర్ బెర్త్ బుకింగ్‌లో ఇకపై ప్రాధాన్యత!

అదే విధంగా కండరాల పనితీరుపై కూడా ఉప్పు ప్రభావం చూపిస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన సోడియంను తిరిగి భర్తీ చేయకపోతే కండరాలు సరిగ్గా కుదురవు, విశ్రాంతి పొందవు. దాంతో కండరాల తిమ్మిర్లు, నొప్పులు, కాళ్ల ముక్కు పట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు, సోడియం లోపం నాడీ వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. మెదడుకు సిగ్నల్స్ సరిగా చేరకపోవడం వల్ల ఏకాగ్రత లోపం, గందరగోళం, చిరాకు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాల దుమ్మురేపింది..! పండగ సీజన్‌లో రికార్డు స్థాయి విక్రయాలు..!

ఇక జీర్ణక్రియలో కూడా ఉప్పు కీలకం. ఉప్పులోని క్లోరైడ్ పదార్థం కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారికి అవసరం. ఇది సరిగా ఉత్పత్తి కాకపోతే ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. అజీర్ణం, ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే నిపుణులు ఉప్పును పూర్తిగా మానేయకుండా పరిమిత మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 5 గ్రాములకన్నా ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. ఉప్పు శత్రువు కాదు — కానీ దాని పరిమితి పాటించకపోతే అది శత్రువుగా మారుతుంది.

Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!
Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!
AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...
అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!

Spotlight

Read More →