Air India: ఎయిరిండియా విమానానికి తప్పని తిరుగు ప్రయాణం.. ఆకాశంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, “అందరికీ ఇళ్లు” పథకంపై వేగంగా చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమై పలు ముఖ్య అంశాలపై చర్చించింది. హౌసింగ్‌, రెవెన్యూ రంగాల్లో సంస్కరణలను సమీక్షించిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ‌, అనగాని సత్యప్రసాద్‌, పార్థసారథి‌, ఆనం రామనారాయణరెడ్డి‌, ఫరూక్‌ పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో పారదర్శకత, న్యాయం, సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు.

World Bank: అమరావతికి వరల్డ్ బ్యాంక్ బంపర్ గిఫ్ట్.. రెండో విడతగా ఫండ్స్!

మంత్రి నారాయణ ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలాల కేటాయింపును రద్దు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు ప్రకటించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని, అందులో 5 లక్షల ఇళ్లను తాము పూర్తిచేశామని ఆయన తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల 61 వేల ఇళ్లు మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి, 2026 జూన్‌ నాటికి అన్ని టిడ్కో ఇళ్లు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Pakistan: పాక్‌లో టమాటా కేజీ ₹600.. అఫ్గాన్ బార్డర్ మూసివేత ప్రభావం!

మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సెంటు, సెంటున్నర స్థలాల స్థానంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇంకా ఇళ్లు కట్టుకోనివారికి అవసరమైతే స్థలం కొద్దిగా పెంచే అవకాశముందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో వినియోగంలో లేని లేఅవుట్లను రద్దు చేసి, కొత్తగా లేఅవుట్లు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి కుటుంబం స్వంత ఇంటి కల సాకారం కావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

చంద్రబాబు పర్యటనలో ఆధ్యాత్మిక అంశం.. నిజంగా నమ్మశక్యంగా లేదు.! ఒక వారసత్వంగా మిగిలిపోయే.!

ఇక భూ కేటాయింపుల విధానంపై కూడా మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చ జరిపింది. సర్వీస్ ఇనామ్ భూములపై పాలసీ రూపొందించేందుకు దేవాదాయశాఖ అధికారులు, తహసీల్దార్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ కమిటీ 45 రోజుల్లోగా నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల విధానాలను సరళీకరించి, ప్రజలకు సులభంగా స్వంత హక్కులు లభించేలా మార్పులు చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. పేదల ఇళ్ల నిర్మాణం, భూముల కేటాయింపు, గృహ హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని మంత్రులు చెప్పారు.

ఏపీకి తుపాను ముప్పు.. రానున్న 48 గంటల్లో పెను తుఫాన్‌గా మారే ఛాన్స్.. హోంమంత్రి అత్యవసర సమీక్ష!
OTT Movie: సస్పెన్స్ లవర్స్‌కు ట్రీట్.. ఒకే కథ.. ముగ్గురు బాధితులు! ఊపిరి బిగబట్టాల్సిందే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cricket: చరిత్రలో తొలిసారి... గెలిచినా కప్పు దక్కని భారత్! ఆసియా కప్ ట్రోఫీ అప్పగింతపై అనిశ్చితి.
Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!
OTT: ఆ హీరో కెరీర్ లో మైలురాయి! థియేటర్ లో హిట్ టాక్! ఓటీటీ లోకి..
Myanmar Scam: మయన్మార్ స్కామ్ సెంటర్‌ నుండి 600 మందికి పైగా పరార్! థాయ్‌లాండ్‌ లో..!