Mudra Loan: ఏపీలో వారందరికి శుభవార్త..! ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు..!

రైల్వే మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో మొట్టమొదటిగా హైడ్రోజన్ ఆధారిత కోచ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ పరీక్ష విజయవంతమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 

Devlopment: జిల్లాకు ప్రత్యేక వైద్యాధికారి.. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం! 143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు!

1,200 హెచ్‌పీ సామర్థ్యం గల డ్రైవింగ్ పవర్ కారును పరీక్షించామని చెప్పారు. పర్యావరణ హిత రవాణాపై దృష్టి సారించిన రైల్వే, డీజిల్ బోగీలను దశలవారీగా తొలగిస్తూ, ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌ వంటి స్వచ్ఛ ఇంధనాలపై దృష్టి పెడుతోంది. కేంద్రం స్క్రాప్ పాలసీతోపాటు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 

Bank Balance: మీ బ్యాలెన్స్ మీ చేతిలో.. మిస్డ్ కాల్ ద్వారా సమాచారం... బ్యాంక్‌కు వెళ్లకుండా ఖాతా వివరాలు!

పర్యావరణానికి హాని కలిగించని విధంగా దేశీయ రవాణా వ్యవస్థ అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే డీజిల్ బోగీలను క్రమంగా దశలవారీగా తొలగిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. దీని స్థానంలో ఎలక్ట్రిక్ ఇంజిన్లను వినియోగంలోకి తీసుకొస్తోంది. దీనికోసం పట్టాల విద్యుదీకరణ శరవేగంగా కొనసాగిస్తోంది. 

Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!

అదే సమయంలో 15 సంవత్సరాల కాలం చెల్లిన వాహనాలకు కూడా చెల్లుచీటి పలుకుతోంది. దీనికోసం ప్రత్యేకంగా స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పర్యావరణ అనుకూల రవాణా విధానాల్లో భాగంగా ఇప్పుడు తాజాగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను కూడా పట్టాలపై పరుగులు పెట్టే రోజు ఎంతో దూరం లేదు. 

AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!

హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమంలో భాగంగా 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ హైడ్రోజన్ కోచ్ లకు రూప కల్పన చేసింది. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా వారసత్వ ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాంతాలు, పర్వత మార్గాల్లో నడిపించనుంది. ఒక్కో రైలుకు సుమారు 80 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయి. 

Goa Governor: కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత ప్రమాణం.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి..

పట్టాల కోసం ఒక్కో రూట్ లో అదనంగా 70 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. రైల్వే ఓ పైలట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం 111.83 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నారు. దీనిని నార్తరన్ రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడపడానికి ప్రణాళికలు రూపొందించారు. 

Kargil Vijay Diwas: ‘శత్రుసేనలను తరిమికొట్టిన రోజు'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

హైడ్రోజన్ ఆధారిత రైళ్ల నిర్వహణ ఖర్చు గురించి ఇంకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. 

Gunmen Suspended: మాజీ మంత్రి పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెండ్..! జైలు దగ్గర ఆ వీడియోనే కొంపముంచింది!

ఆర్థికపరమైన అంశాలతో పాటు, హైడ్రోజన్ ఇంధనం వల్ల పర్యావరణానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. హైడ్రోజన్ ఆధారిత రవాణాకు కేంద్రం ఇస్తోన్న ప్రోత్సాహం రైల్వేకు మాత్రమే పరిమితం కాలేదు. 

flight: హైవేపై కూలిన విమానం..! పైల‌ట్‌తో స‌హా ఇద్ద‌రు మృతి!

2024లో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఇండియన్ ఆయిల్ అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సును భూటాన్ ప్రధాన మంత్రి షేరింగ్ తోబ్గేకు బహుమతిగా అందజేశారు.

Reconstruction temple: ప్రత్యేక నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి... రూ.500 కోట్లు!
Praja Vedika: నేడు (26/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ప్రజలు అవస్థలు... వచ్చే 48 గంటలు కీలకం!
Kargil Vijay Diwas: అమర జవాన్ల త్యాగానికి దేశం తలవంచి వందనం.... రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు!
Jagan Shock: వైసీపీలో మొదలైన హైటెన్షన్.. ‘ఆడుదాం ఆంధ్ర'పై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక.! ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..
TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.... 73576 మంది భక్తులు నిన్న!