Header Banner

ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..! అకౌంట్‌లోకి డబ్బులు!

  Fri May 16, 2025 17:13        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేస్తోంది. ఇప్పటికే మొదటి సిలిండర్‌కు సంబంధించిన రాయితీ డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్‌లలో జమ చేయగా.. రెండో సిలిండర్ డబ్బుల్ని కూడా విడుదల చేస్తున్నారు. అయితే చాలా మందికి రెండో విడత గ్యాస్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. మొదటి విడతలో డబ్బులు త్వరగా వచ్చాయి.. కానీ రెండో విడతలో ఆలస్యం అవుతోందంటున్నారు. సాంకేతిక సమస్యల వల్ల నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైందని.. త్వరలోనే డబ్బులు బ్యాంకు అకౌంట్‌లలో జమ చేస్తారని అధికారులు తెలిపారు. మొదటి విడతలో డబ్బులు పొందిన వారందరికీ రెండో విడతలో కూడా వస్తాయని.. ఎవరూ కంగారు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఈ మేరకు దీపం పథకం గ్యాస్ సిలిండర్ల రాయితీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో చెక్ చేయగా.. వారికి వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు ఉండడం వల్ల.. అలాగే 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడం వల్ల రాయితీకి అనర్హులైనట్లు తేలిందట. మరికొందరు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు జమ కాలేదంటున్నారు. ఈ మేరకు ఈకేవైసీ పూర్తి చేసేందుకు గ్యాస్ డీలర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. సాంకేతిక ఇబ్బందులతోనే నిధుల విడుదలలో కాస్త ఆలస్యమైందని.. వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలకు నిధులు జమ అవుతాయంటున్నారు. ఈకేవైసీతో పాటుగా బ్యాంకు అకౌంట్‌లకు ఆధార్ లింక్ కాకపోవడంతో కొందరికి గతంలో డబ్బులు జమకాలేదు.. దీనిని కూడా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.. వీటన్నిటిని సరిచేసుకుంటే బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ అవుతాయంటున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..



మరోవైపు ఏపీ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపం పథకం కింద డబ్బుల చెల్లింపు చేయాలని.. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 'ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని.. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే సిలిండర్‌ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేయాలని' నిర్ణయించారు. మరోవైపు ప్రతి నెలా సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు ఫించన్లు కూడా అందించనున్నారు. జూన్ 12న ఎన్నికల హామీలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అంతేకాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభిస్తామంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FreeGasSubsidy #LPGSubsidy #GasCylinderMoney #SubsidyUpdate #AccountCredit #SimpleSteps #GasScheme