War 2 Trailer : ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్... వార్ 2 ట్రైలర్‌కు మాస్ రెస్పాన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ.605 కోట్ల వేతన బకాయిలును గురువారం కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తం మరో రెండు నుంచి మూడు రోజుల్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అయితే ఇప్పటికీ కేంద్రం రూ.2,500 కోట్లకు పైగా వేతనాలను చెల్లించాల్సి ఉంది.

Vice President: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నేత ఫిక్స్..! వర్షాకాల సమావేశాల్లో..!

ఇటీవలి కాలంలో వేతన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాయగా, స్పందించిన కేంద్రం మొదటి విడతగా ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మిగతా బకాయిలను దశలవారీగా చెల్లించనున్నట్లు సమాచారం.

Dried fish: ఎండు చేపలు మేలు చేస్తాయా... బీపీ, కిడ్నీ సమస్యలున్నవారు జాగ్రత్త!

ఇకపై ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రోజు రెండు సార్లు—ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు—కూలీల ఫోటోలు తీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించగా, పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షించాలి. మండల స్థాయి అధికారులు, ఎంపీడీవోలు నివేదికలు సమర్పించాలి.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు... ఈ వీకెండ్ స్పెషల్!

ఈ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించడమే లక్ష్యం. కాగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా ఏర్పాటైనది. వ్యవసాయ రుతువుల మధ్యకాలంలో ఆదాయం అందించేందుకు, గ్రామీణ వలసలను తగ్గించేందుకు ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.

Month of Shravan: ఈరోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం.... పూజలకు పండితుల సూచనలు!
AP Govt: భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!
Mining Case: మైనింగ్ కేసు.. ఐఎస్ఐ శ్రీలక్ష్మి కి హైకోర్టు లో చుక్కెదురు!
Highway: ఏపీలో మరో కొత్త హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా..! ఈ రెండు చోట్ల బైపాస్‌లు, ఆ జిల్లాకు మహర్దశ!
AP Crime News: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. జంట హత్యల కేసులో ఏ1గా వైకాపా నేత!