డీఆర్డీవో రూపొందించిన మిషన్ దివ్యాస్త్ర విజయవంతం... ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించిన అగ్ని-5 క్షిపణి... ఎంఐఆర్వి సాంకేతికతతో రూపొందించిన అగ్ని-5 క్షిపణి - డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్... దేశీయంగానే ఎంఐఆర్వీ సాంకేతికతను అభివృద్ధి చేసిన "డీఆర్డీఓ శాస్త్రవేత్తలను చూస్తే గర్వంగా ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్నీ-5 మిసైల్ తొలి టెస్ట్ ఫ్లైట్, మిషన్ దివ్యాస్త్ర సక్సెస్ అయ్యింది, " అని మోదీ తెలిపారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ మిషన్ దివ్యాస్త్ర.. అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్ అని తెలుస్తోంది. దేశ భౌగోళిక స్థితిగతులను మార్చేసే సత్తా దీనికి ఉన్నట్టు సమాచారం. ఎంఐఆర్వీ టెక్నాలజీతో.. ఒక్కటే మిసైల్ని ఉపయోగించి మల్టిపుల్ వార్ హెడ్స్ని, వివిధ ప్రాంతాల్లో మోహరించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రపంచంలో.. ఈ ఎంఐఆర్వీ టెక్నాలజీ కలిగిన ఉన్న దేశాలు చాలా తక్కువ! ఇక మిషన్ దివ్యాస్త్ర సక్సెస్ అవ్వడంతో.. వాటి సరసన చేరింది ఇండియా.ఈ అగ్ని-5 మిసైల్ సిస్టెమ్లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టెమ్స్ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్ ప్యాకేజ్లు కూడా ఉంటాయి. ఫలితంగా.. రీ-ఎంట్రీ వెహికిల్స్... అత్యంత అక్యురసీతో టార్గెట్స్ని హిట్ చేస్తాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశ టెక్నాలజీ శక్తికి... ఈ మిషన్ దివ్యాస్త్ర ఉదాహరణగా నిలువనుంది.
ట్యాక్స్ పేయర్స్కి గుడ్న్యూస్!! లక్ష వరకు పెండింగ్ ట్యాక్స్ మాఫీ!!
అగ్నీ-5 రేంజ్ 5000 కి.మీలు. భారత దేశ సుదీర్ఘ భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. చైనా ఉత్తర భాగంతో సహా మొత్తం ఆసియా, యూరోప్లోని కొన్ని ప్రాంతాలు.. ఈ మిసైల్ స్ట్రైకింగ్ రేంజ్ అని తెలుస్తోంది!
అగ్నీ1-4 క్షిపణుల రేంజ్ 700కి.మీలు- 3,500 కి.మీల మధ్యలో ఉంటుంది. వీటిని భారత దేశ భద్రత కోసం ఇప్పటికే మోహరించారు.దేశ భద్రతకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా.. బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకునేందుకు ప్రత్యేక సిస్టెమ్లను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసి, టెస్ట్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇవి కూడా చదవండి:
నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!
అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు
గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!
మోడీ, బాబు, పవన్, మహాసభకు చిలకలూరిపేట వేదిక! 150 ఎకరాలలో! పరిశీలిస్తున్న అధిష్టానం!
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి