F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!! F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!! డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ! Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు! Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!! Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..! 140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ... Movie update: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ! “డ్రాగన్” కోసం మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!!

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

2024-03-09 17:26:00

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడం అన్న రీతిగా సాగింది.

రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఒక్కొక్క జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టలేదు కానీ వైసీపీ పార్టీ కార్యాలయాలకు మాత్రం విలువైన ప్రభుత్వ స్థలాలను ఈయన కొట్టేశారు.

రాష్ట్రంలోని ఒక్కొక్క జిల్లాలో ఎకరం నుండి రెండు ఎకరాల వరకు కోట్ల రూపాయల విలువైన స్థలాలను 33 సంవత్సరాలకు కేవలం సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజు ఇచ్చేలా ప్రభుత్వ స్థలాలను ఈయన కొట్టేశారు.

ఇవే స్థలాలు వ్యాపార సంస్థలకు ఇస్తే నెలకు 10 లక్షలు తగ్గకుండా ఆదాయం వచ్చే వాటిని వేల రూపాయల లీజుకు కేటాయించడం ప్రజా సంపదను దోపిడీ అనరా?

మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

25 జిల్లాలను ఏర్పాటు చేసిన ఈయన పట్టుమని పది జిల్లాలలో కూడా కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మించలేకపోయారు.

సలహాదారులను తన సొంత మనుషులను నియమించుకొని వారికి లక్షలలో జీతాలు ఇచ్చి ప్రభుత్వ సొమ్ము కోట్లలో దోచిపెట్టారు.

ప్రజలను పాలించడానికి రాజ్యాంగం కల్పించిన ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉండగా రాజ్యాంగానికి విరుద్ధంగా సలహాదారుల వ్యవస్థను ఈయన ప్రవేశపెట్టారు.

ప్రజా సంపద దోచిపెట్టడానికే సలహాదారులు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏ ఒక్క సలహాదారుడు ఏ ఒక్క సలహా ఇచ్చిన దాఖలాలు లేవు.

వైసిపి పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వాలంటీర్లను నియమించి వారికి నెలకు 5000 రూపాయలు వేతనం చొప్పున కొట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచి పెట్టారు.

ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!

ఈయన సొంత పత్రిక సాక్షి పేపర్ ను రాష్ట్రంలో సర్క్యులేషన్లో అగ్రస్థానంలో నిలపడానికి వాలంటీర్లకు పత్రికల కొనుగోళ్ల కోసం నెలకు 200 చొప్పున ఇచ్చి సాక్షి పేపర్ కొనుగోలు చేయించి వారి వద్ద నుండి లాక్కుంటున్నారు.

నిబంధనలను తుంగలో తొక్కి కోట్లాది రూపాయల సొమ్మును సాక్షి పత్రిక సాక్షి మీడియాలో ప్రకటన రూపంలో ఇచ్చి ప్రజా సంపదను ఈయన దోచుకున్నాడు.

విశాఖపట్నంలో విలువైన భూములను తన అనుచరులు దోచుకుంటుంటే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

విశాఖపట్నం కి రక్షణ కవచంగా ఉన్న ఋషికొండను గుండు కొట్టించి బీచ్ వ్యూ భవనాలను నిర్మించుకున్న ఈయన ఆ భవనాల నిర్మాణానికి 500 కోట్లు వెచ్చించారు.

ఈయన వైకాపా పార్టీ రంగులతో భవనాలను నింపడానికి 300 కోట్లు ప్రజా సంపదను దుర్వినియోగం చేశారు.

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై కోర్టు అక్షింతలు వేస్తే మళ్లీ 300 కోట్ల రూపాయలతో వైసిపి పార్టీ రంగులను మార్చారు.

ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై వైకాపా రంగులు ఈయన ఫోటోలతో తయారైన బ్రోచర్లు సంచులు స్టిక్కర్లు ఇలా దుబారా ఖర్చు కోట్లలో ఉంది.

జగనన్న సురక్ష కార్యక్రమం అంటూ గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చే పది రూపాయల మందులు వేయడానికి ఈయన పార్టీ రంగులు ఫోటోతో నిర్మించిన వంద రూపాయలు సంచికి, 50 రూపాయలు ఓపి కార్డుకు ఖర్చు పెట్టారు.

వ్యవసాయ భూముల సర్వే పేరుతో జగనన్న ముహక్కు భూ సర్వే అనే పథకాన్ని ప్రవేశపెట్టి సర్వే రాళ్లపైన కూడా ఈయన ఫోటోలు ముద్రించి పాతించారు.

రైతుల భూహక్కు పత్రాలపై కూడా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పక్కన ఈయన ఫోటోలు వేయించుకుని ఇవ్వడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

గ్రామ సచివాలయాలలో ప్రజలకు ఇచ్చే కులదృవీకరణ నివాస ధ్రువీకరణ ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై కూడా ఈయన ఫోటోలతోనే ఇస్తున్నారు.

ఈయన ప్రచార పిచ్చి రాష్ట్ర సంపదలో 30 శాతానికి పైగా ఖర్చు పెడుతున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు ఎలా కనబడతాయి.

గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు కూల్చివేసి గ్రామ సచివాలయాలు అంటూ ఉపాధి హామీ నిధులను మళ్లించి భవనాల నిర్మాణం చేపట్టారు.

ఉన్న భవనాలను వేరే వాటికి ఉపయోగించుకుని కొత్త భవనాలు నిర్మిస్తే ప్రజలకు ఉపయోగము కానీ పాత భవనాలు కూల్చడం ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు.

రాష్ట్రంలో ఉన్న ప్రధాన నదులలో విస్తృతంగా దొరికే ఇసుకను ఈయన నూరు శాతం దోపిడీ చేశారనడంలో సందేహం లేదు.

దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్

పగలు రాత్రి తేడా లేకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు.

గిరిజన ప్రాంతాలలో మాత్రమే దొంగ చాటుగా పండించే గంజాయి నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బహిరంగ పండించే విక్రయాలు జరుపుతున్నారు.

ఈయన బ్రాండ్లతో రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేయడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఈయన ప్రభుత్వం.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంతో ఉన్న యువకులు బ్లేడ్ బ్యాచులుగా తయారై అసాంఘిక శక్తులుగా తయారయ్యారు.

రాష్ట్రం సంపదను అన్ని విధాల దోచుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే పరిష్కారంగా రాష్ట్ర ప్రజలు కొరత నిశ్చయంతో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:   

గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు

ఇద్దరు సీఐలు నాపై దాడి చేశారు!! పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి!!

వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రిపై వైసీపీ దాడి!!

ఆస్ట్రేలియా: కృష్ణా జిల్లా ఉంగుటూరు వైద్యురాలు వేమూరు ఉజ్వల మృతి! అసలు ఎవరీమె? స్వగ్రామం చేరుకోనున్న మృతదేహం

Evolve Venture Capital  

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

 అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →