లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ (ఆన్లైన్) మార్గంలో రుణాలు ఇచ్చే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు కోటి రూపాయల వరకూ జరిమానా విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదించింది. ఇది చట్టంగా మారితే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా పర్మిషన్ లేని వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్లు అప్పులు ఇవ్వడం కుదరదు. అనియంత్రిత రుణ వ్యాపార కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు 2021 నవంబర్ లో తన నివేదికను సమర్పించింది. అనియంత్రిత రుణ కార్యకలాపాలను నిషేధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు పలు చర్యలను వర్కింగ్ గ్రూపు సూచించింది.
ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss
ఆర్బీఐ లేదా ఇతర నియంత్రణ మండళ్లతో పాటు ఏదైనా చట్ట ప్రకారం రుణ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిలేని వ్యక్తులు లేదా సంస్థలను నిషేధించాలని ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. నియంత్రిత రుణాలకు సంబంధించిన ఏ చట్టం పరిధిలోకి రాని భౌతిక, డిజిటల్ లేదా ఇతర మార్గాల్లో నిర్వహించే రుణ కార్యకలాపాలను (బంధువులకిచ్చే రుణాలు మినహా) అనియంత్రిత రుణ వ్యాపారంగా బిల్లు నిర్వహించింది. నియమావళికి విరుద్దంగా రుణాలిచ్చే వారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల నుంచి కోటి వరకూ జరిమానా విధించనున్నట్లు బిల్లులో ప్రతిపాదించారు. రుణ గ్రహీతలను వేధించడం లేదా అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి పాల్పడే వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అనియంత్రిత రుణదాత, రుణ గ్రహీతలు, ప్రాపర్టీలు పలు రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పక్షంలో లేదా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయి సొమ్ముకు సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు. బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (బీయూఎల్ఎ,బులా) పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై 2025 ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్తో భేటీ - దీని కారణంగానే..
అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్షిప్ పొందారో తెలిస్తే షాక్!
అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!
ఎస్బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్ స ర్కిల్లో 342 పోస్టులు!
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!
కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: