నిరుద్యోగ యువతకు ఇదో అద్భుత అవకాశం. రాబోయే అయిదేళ్లలో దేశంలో దాదాపు 500 టాప్ కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదువుకుని, సరైన ఉద్యోగంలేక ఎన్నో అవస్థలు పడుతున్న యువతకు ఇదో అద్భుత అవకాశమనే చెప్పాలి. ఈ పథకంలో భాగంగా యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. మొత్తం 20కి పైగా రంగాలను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్లో వీటిని తినండి! రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది!
ఎవరు అర్హులంటే..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమాతోపాటు ఏదైనా డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. ఆన్లైన్, దూరవిద్య ద్వారా కోర్సులు చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 21, 2025వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి ఏడాది ట్రైనింగ్ సమయంలో రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం కూడా అందిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!
వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!
ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!
ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: