జిల్లాలోని బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. ఇంటిపై తిరుగుతున్న డ్రోన్ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. డ్రోన్ ఎగురవేస్తున్న వైసీపీ నేత అబ్దుల్ ఫయీజ్ అనుచరులతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి మంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ఆ డ్రోన్ను గుర్తించారు. వెంటనే అలర్ట్ను అయిన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్ ఎవరిదో గుర్తించారు. వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫయీజ్ కుమారుడి వివాహం కవరేజ్కు వచ్చిన కెమెరామెన్లు ఈ డ్రోన్ను ఎగురవేసినట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై వారిని సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మంత్రి ఇంటిపై డ్రోన్ను ఎందుకు ఎగురవేశారని.. ఎగురవేయాల్సిన అవసరం ఏంటి అని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. అయితే వారు అడిగిన ప్రశ్నకు డ్రోన్ను ఎగురవేసిన వ్యక్తులు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసేందుకు యత్నించారు.
ఇంకా చదవండి: ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్పై భారీగా తగ్గింపు..
విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఇరువర్గాలకు చెందిన వారు పోలీస్స్టేషన్కు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణుల తరపున మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి పోలీస్స్టేషన్కు వచ్చి టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని.. వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. డ్రోన్లు ఎందుకు ఎగురవేశారని... ఉద్దేశపూర్వకంగానే మంత్రి ఇంటి ఆవరణలో డ్రోన్ను ఎగురవేశారని.. వైసీపీ వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. అయితే బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి వర్గాల మధ్య కొంత కాలంగా వార్ నడుస్తున్న నేపథ్యంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఫోన్ సర్వీస్కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! డేటా రక్షణపై కీలక సూచనలు!
ఎస్బీఐ కీలక ప్రకటన! లోన్లపై కొత్త వడ్డీ రేట్లు! ఇవాళ్టి నుంచే అమల్లోకి!
ఈ పథకం ద్వారా.. రూ.3 లక్షల వరకు వడ్డీ లేని లోన్.. కావాల్సిన డాక్యుమెంట్స్.. దరఖాస్తు ఇలా..!
గుడ్ న్యూస్.. మహిళలకు, రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం! సంక్షేమ పథకాలు పంపిణీలో..
వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్! కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం.. ఏదో ఒక కొత్త విషయం..
మాపై దాడి అలా జరిగింది.. మాజీ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్! న్యాయం జరిగే వరకు పోరాటం..
18 ఏళ్లు నిండిన మహిళలకు భారీ శుభవార్త! నెలకు రూ.7వేలు డైరెక్ట్ గా అకౌంట్లోకే!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
జగన్ వి పగటి కలలా లేక రాత్రి కలలా? వైసీపీ ఎందుకు ఖాళీ అవుతోందో ఇప్పుడు అర్థం అవుతుంది!
ఏపీ ప్రభుత్వం వారికి మరో అదనపు సెలవు ప్రకటించింది! జీవో 73తో ఉద్యోగులకు రిలీఫ్!
అమెరికాలో కార్చిచ్చు వేళ అందినకాడికి దోచుకుంటున్న దొంగలు! 29 మంది అరెస్ట్!
ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల! దరఖాస్తు వివరాలు తెలసుకోండి!
దొంగ నోట్ల కలకలం! నకిలీ రూ. 500 నోటును ఎలా గుర్తించాలి! ఇవి లేకపోతే నకిలీనే!
వందల నుంచి లక్షల వరకు బెట్టింగులు.. కోడి పందేల హవా నెక్స్ట్ లెవల్! పోలీసుల ఆంక్షలపై లైట్..!
వారెవ్వా.. ఆ జిల్లాలో కోడిపందెం గెలిస్తే 'మహీంద్రా థార్'.. సందడి ఏ రేంజిలో ఉంటుందో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: