బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల మాదిరిగానే పురుషుల గ్రూపులను ఏర్పాటు చేయిస్తోంది. తద్వారా వారితో పొదుపు కట్టించి బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇక తొలివిడతగా అనకాపల్లిలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాలనేది టార్గెట్ కాగా ఇప్పటికే 20 గ్రూపులు ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. డ్వాక్రా సంఘాల మాదిరిగా కామన్ ఇంట్రస్ట్ గ్రూపులు (సీఐజీ)
టీడీపీ హయాంలో పది మంది మహిళా సభ్యులతో ఒక్కో డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేసి, వారితో పొదుపు చేయించారు. దీని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇదే తరహాలో ఐదుగురు సభ్యులతో కామన్ ఇంట్రస్ట్ గ్రూపు (సీఐజీ) ఏర్పాటు చేస్తున్నారు. వాచ్మెన్లు, ప్రైవేట్గా పనిచేస్తున్నవారు, రిక్షాకార్మికులు, జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్, భవన నిర్మాణ కార్మికులు ఇలా ఎవరైనా 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పురుషులు సీఐజీలో చేరొచ్చు.
ఇంకా చదవండి: నేడు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
అనకాపల్లి జీవీఎంసీ జోనల్ ఆఫీస్లోని యూసీడీ కార్యాలయంలో ఆధార్, తెల్ల రేషన్ కార్డులు జతచేసిన దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు. సీఐజీ గ్రూపులకు తొలివిడతలో రూ. 75వేల నుంచి రూ. లక్ష వరకు రుణం అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనకాపల్లిలో 20 సీఐజీ గ్రూపులు ఏర్పాటు అయినట్లు యూసీడీ పీడీ వై. సంతోష్ కుమార్ తెలిపారు. ఐదుగురు సభ్యులు వస్తే ఎన్ని గ్రూపులైనా పెట్టడానికి రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని అన్నారు. వాటిని సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే బ్యాంకులు రుణ పరిమితిని పెంచుతాయని తెలిపారు.
ఇంకా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్! బియ్యంతో పాటు అది కూడా ఇస్తారు.. తీసుకోకపోతే మోసపోయినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
USA: H1B వీసా కొత్త రూల్స్ ఇవే.. ఉద్యోగస్తులు కచ్చితంగా అలా చేయాల్సిందే! మరో 20వేల వీసాలను జారీ!
మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే! నాగబాబు చేరిక పై..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: