ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి తో పాటుగా పరిశ్రమలకు భూ కేటాయింపులు.. సంక్షేమ పథకాల అమలు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. జనవరి లో కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన మంత్రివర్గంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు పథకం పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఈ భేటీలో సీఎం చంద్రబాబుకు మంత్రులకు ర్యాంకులు.. ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నారు. ఏపీ మంత్రివర్గం ప్రతీ 15 రోజులకు ఒక సారి సమావేశం కావాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో రెండో సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన పైన సమీక్ష చేయనున్నారు.
ఇంకా చదవండి: బయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ! నెల రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
మంత్రుల ఆరు నెలల పని తీరు పైన ముఖ్యమంత్రి ర్యాంకులు ఖరారు చేసారు. మంత్రులుగా పని తీరు పైన నివేదికల ఆధారంగా వారికి మార్కులు ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్.. లోకేష్ పని తీరు సమర్ధవంతంగా ఉందని ముఖ్యమంత్రికి అందిన నివేదికల ఆధారంగా నిర్దారించారు. అదే విధంగా మంత్రివర్గంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ లు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మూడు నెలల్లో హోం మంత్రి అనిత రెండో స్థానంలో ఉండగా.. గత రెండు నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి నాగబాబు చేరిక పైన ఈ సమావేశం లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇంకా చదవండి: సర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే వైకాపా నాయకుడు వచ్చినా భరించాం! తెదేపా నేతలు సహకారంపై...!
కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి అసంతృప్తి తో ఉన్నారని..ఈ భేటీలో వారికి హెచ్చరిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాలన ముగియడంతో పని తీరు మెరుగుపర్చు కోవటం పైన సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ భేటీలో సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. అలాగే వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీ షెడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. కొత్త రేషన్ కార్డులు.. జనవరి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రారంభం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా .. తదనంతర పరిణామాల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇంకా చదవండి: త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్వి పగటి కలలేనా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: