ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే పలు పథకాలను ప్రారంభించింది. చెప్పిన విధంగానే పెన్షన్లను పెంచి.. పెండింగ్ నెలల పింఛన్ డబ్బులను కూడా పంపిణీ చేస్తున్నారు. స్వయంగా అధికారులే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వీటితో పాటు.. అన్నా క్యాంటీన్లను కూడా మరొసారి అందుబాటులోకి తెచ్చి.. కార్మికులు, అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించిన ప్రభుత్వం.. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందించాలని సిద్ధమవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత, దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ పథకం అమలుకు మహిళలు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంకా చదవండి: రాజధాని అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ఈ సౌకర్యం నవంబర్ 20 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం తలెత్తడంతో భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మార్గం ద్వారా రావాలని సూచించారు. ఘాట్ రోడ్డులో ఎవరికీ, వీఐపీలు సహా, అనుమతి ఉండదని దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకు ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఈ మార్పులను గమనించి, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నేడు(నవంబర్ 19) కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!
నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!
ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!
మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!
గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss
వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: