ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో గంగానది తీరం వెంట ఏర్పాటు చేసిన టెంట్ సిటీలో ఈ ఘటన జరిగింది. గుడారాల్లో వంట కోసం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. సమీపంలోని గుడారాలకు ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే గుడారాల వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలోని టెంట్ సిటీ 19వ సెక్టార్ లో ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇంకా చదవండి: ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...
రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం, ఒక్కసారిగా మంటలు, నల్లటి పొగ కమ్ముకోవడంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. సుమారు 15 నుంచి 18 గుడారాలు పూర్తిగా దగ్ధమైనట్టు భావిస్తున్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఆ చుట్టుపక్కల గుడారాల నుంచి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలుత గీతాప్రెస్ కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయని... ప్రాణనష్టం జరిగినట్లు సమాచారమేదీ లేదని మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్టం వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?
ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?
జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు
మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!
వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!
ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!
ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!
'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!
జగన్కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: