తెలుగు రాష్ట్రాల్లో పండుగల పేర్లు చెబితే ముందుగా గుర్తొచ్చేది మాంసం, మద్యం. ఈ రెండు లేకుండా ప్రజలు పండుగలు చేయరనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఓ సంస్థ దేశంలోని ప్రజలు మద్యం తాగడానికి పెడుతున్న ఖర్చు ప్రకారం వివిధ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం మద్యంపై అత్యదికంగా ఖర్చపెడుతున్న రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో సగటున ఓ వ్యక్తి రూ.1623 మద్యం కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. అలాగే రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ సగటున రూ. 1306 ఖర్చు చేస్తుండగా.. మూడో స్థానంలో ఉన్న పంజాబ్ రూ. 1245, నాలుగో స్థానంలో నిలిచిన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి 1227 రూపాయలను మద్యంపై ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2022 సర్వే ప్రకారం.. దేశంలో పాపులర్ బ్రాండ్లుగా.. కింగ్ ఫిషర్, మెకోవెల్స్, టుబర్గ్ బ్రాండ్లు నిలిచాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఏపీలో రైతులకు భారీ శుభవార్త... ఇకనుంచి రూ.3వేలు! అర్హులు ఎవరు అంటే!
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: