అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రంప్ కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. అయితే చివరికి రేస్ నుంచి తప్పుకుని ట్రంప్కు మద్దతు పలికారు. ట్రంప్ గెలుపుకు కృషి చేశారు. దీంతో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్ రామస్వామితో పాటు ఎలాన్ మస్క్కు తన కార్యవర్గంలో ట్రంప్ కీలక పదవులు కట్టబెట్టారు. కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యతలను వారికి అప్పగించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ట్రంప్ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి కీలక నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. రామస్వామి ఆ పదవి నుంచి తప్పుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని భావిస్తున్నారు. గవర్నర్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒహైయో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!
వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ! ఒకేసారి 27 మంది.. ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
నారా లోకేష్ డిప్యూటీ సిఎం పదవి డిమాండ్ల పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం! కీలక ఆదేశాలు జారీ!
టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: