Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.! Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు: మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన! Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.!

Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు!

Aviation Safety: దేశంలోని 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని సివిల్ ఏవియేషన్ స్టాండింగ్ కమిటీ తన తాజా ఆడిట్ నివేదికలో హెచ్చరించింది.

Published : 2026-03-28 14:12:00

ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు.. విమానాల్లో నిగ్గుతేలిన సాంకేతిక లోపాలు…

377 విమానాల్లో సమస్యలు.. స్టాండింగ్‌ కమిటీ సంచలన నివేదిక..

ఇండిగో విమానాల్లోనే అత్యధిక లోపాలు: బయటపడ్డ చేదు నిజం

Aviation Safety: విమానయాన సంస్థలు తమ లాభాల కోసం ప్రయాణికుల భద్రతను పూర్తిగా విస్మరిస్తున్నాయని, డొక్కు విమానాలను యథేచ్ఛగా నడుపుతున్నాయని కమిటీ మండిపడింది. దేశంలో నడుస్తున్న వాణిజ్య విమానాల్లో దాదాపు 50 శాతం విమానాలు సాంకేతిక లోపాలతోనే ప్రయాణిస్తున్నాయని ఈ నివేదికలో వెల్లడించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విమానాల్లో చిన్నపాటి లోపం ఉన్నా అది పెను ప్రమాదానికి దారితీస్తుందని తెలిసినా, సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నివేదిక తయారీ కోసం గత ఏడాది జనవరి నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన మొత్తం 754 విమానాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆడిట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. తనిఖీ చేసిన విమానాల్లో 377 విమానాల్లో తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే గగనతలంలో ప్రయాణించే ప్రతి రెండు విమానాల్లో ఒక విమానం ఏదో ఒక సమస్యతోనే ప్రయాణికులను మోసుకెళ్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బయటపెట్టింది.

ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగోపై ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. తనిఖీలు చేసిన విమానాల్లో ఇండిగో సంస్థకు చెందినవే అత్యధికంగా ఉన్నాయని, అలాగే లోపాలు కూడా ఆ సంస్థ విమానాల్లోనే ఎక్కువగా కన్పించాయని కమిటీ స్పష్టం చేసింది. సాధారణంగా విమానాల నిర్వహణ కోసం ఖచ్చితమైన నియమావళి ఉంటుంది, కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనే ఉద్దేశంతో నిర్వహణను గాలికొదిలేస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇంజిన్ సమస్యలు, విమాన పరికరాల పనితీరులో లోపాలు ఉన్నప్పటికీ విమానాలను నడపడం తీవ్రమైన నేరంగా కమిటీ పరిగణించింది.

ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ పౌర విమానయాన శాఖను కోరింది. లోపాలు ఉన్న విమానాలను తక్షణమే పక్కన పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలని సూచించింది. దేశంలో విమాన ప్రయాణం అంటే భయపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) మరింత కఠినంగా వ్యవహరించాలని నివేదిక పేర్కొంది. ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ప్రతి విమానాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Spotlight

Read More →