Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు! Pawan Kalyan: వైసీపీ మళ్లీ రాదు.. అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు! వారికి పవన్ కల్యాణ్ గట్టి భరోసా.. Varun Tej: మెగా సంబరం.. వరుణ్ తేజ్ 'బరి' ప్రారంభం.. ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్! New Airport: ఆసియాలోనే అతిపెద్దది.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ! MLA Sirisha: కులానికి కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని.. అమరావతిపై విషప్రచారాన్ని ఖండించిన శిరీష.! Middle East War: గల్ఫ్ యుద్ధ పరిస్థితులపై చంద్రబాబు ముందు చూపు! చీఫ్ సెక్రటరీ తో పాటు 12 మంది వివిధ శాఖాధిపతుల తో కమిటీ ఏర్పాటు! Konatala Ramakrishna: రాజధాని శ్మశానం కాదు.. రైతుల త్యాగాల పురిటిగడ్డ.. వైసీపీ వ్యాఖ్యలపై కొణతాల ఆగ్రహం.! TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు! Aviation Safety: 754 విమానాల్లో తనిఖీలు.. సగం విమానాల్లో భద్రతా లోపాలు! IndiGo: ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 161 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు.! Daggubati Purandeswari: తక్కువ ఛార్జీలతో.. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు!

Narayana: రాజధానిపై గత పాలకుల కుట్రలను బట్టబయలు చేసిన మంత్రి.. వైసీపీ విషప్రచారానికి కాలం చెల్లింది..

Narayana Comments On ycp: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఎదురైన సవాళ్లు, అమరావతి రాజధాని ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు.

Published : 2026-03-28 13:40:00
  • Politics: సింగపూర్ మాస్టర్ ప్లాన్.. నార్మన్ ఫోస్టర్ డిజైన్లు: అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం..
     
  • మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి అంధకారం: వైసీపీ హయాంలో రాజధాని విధ్వంసాన్ని వివరించిన మంత్రి..

Narayana Comments On ycp: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఎదురైన సవాళ్లు, అమరావతి రాజధాని ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యంపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ప్రజలంతా రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరినప్పటికీ, నాటి పాలకులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని విభజించారని ఆయన విమర్శించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందని, విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచినప్పటికీ, సొంత గడ్డపై పరిపాలన సాగించాలనే సంకల్పంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉండటంతో పాటు రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిని ఎంపిక చేశామని, 2014లో ఈ నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని మంత్రి గుర్తు చేశారు.

రాజధాని నిర్మాణం కోసం ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి, 29 వేల మంది రైతుల నుంచి సుమారు 30 వేల ఎకరాల భూమిని ఎటువంటి వివాదాలు లేకుండా సేకరించామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కౌలుతో పాటు నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం, ఐకానిక్ భవనాల కోసం అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన నార్మన్ ఫోస్టర్ సంస్థతో డిజైన్లు సిద్ధం చేయించామన్నారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై విషప్రచారం మొదలుపెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతిలో భూకంపాలు వస్తాయని, వరదలు ముంచెత్తుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, రివర్ బెడ్ మరియు రివర్ బేసిన్ కు మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని విమర్శించారు.

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ అర్థరహితమైన వాదనలు చేస్తూ, రాజధాని నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులను రెచ్చగొట్టి, వారి త్యాగాలను కించపరిచేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి గత పాలకులు పన్నిన కుట్రలను అధిగమించి, ఇప్పుడు మళ్లీ రాజధాని పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →