Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా? Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! Health Tips: రాత్రిపూట కూడా వడదెబ్బ తగులుతుందట... ఇలా చేస్తే అరికట్టవచ్చు! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mango Health Benefits: ఆరోగ్యానికి 'కల్పవృక్షం'.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఒక అద్భుత ఔషధమని మీకు తెలుసా? Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Saudi Arabia: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం దిశగా సౌదీ అరేబియా అడుగులు.... Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! Health Tips: రాత్రిపూట కూడా వడదెబ్బ తగులుతుందట... ఇలా చేస్తే అరికట్టవచ్చు! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే!

Farmers: రైతులకు శాస్త్రీయ మార్గదర్శకంగా “పశుసంవర్ధక మార్గదర్శిని” ప్రారంభం

Farmers: ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.

Published : 2026-04-30 16:10:00

పాడి పశువుల నుంచి కోట్ల ఆర్థిక వృద్ధి..

రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చ‌ర్య‌లు..

ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో మార్గనిర్దేశం చేయడానికి “పశుసంవర్ధక మార్గదర్శిని” అనే ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, చిన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధంగా ఉన్నారని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రంగం ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం పశుసంవర్ధక రంగ ప్రాధాన్యతను చూపిస్తోందన్నారు. అయితే సంప్రదాయ పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యలు వృద్ధికి అడ్డంకులుగా మారుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం యువత సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, పశుసంవర్ధక రంగంలో వాణిజ్య అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి సూచించారు. పాడి పశువులు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో 200 మంది రైతులు వాణిజ్యపరంగా విజయవంతంగా తమ వ్యాపారాలను ప్రారంభించారని వెల్లడించారు.

రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ-మేగజైన్‌ను ఏప్రిల్ నెల నుంచి “స్మైల్” వెబ్‌సైట్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచారు. ఇందులో పశు ఆరోగ్యం, పోషణ, పునరుత్పత్తి, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, నిపుణుల సూచనలు, విజయగాథలు అందిస్తారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో ఈ మేగజైన్ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

పశుసంవర్ధక రంగాన్ని సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించినట్లుగా ప్రతి ఇంట్లో ఒక ఎంట్రప్రెన్యూర్ ఏర్పడి, రైతుల ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డా. వై. సింహాచలం, జాయింట్ డైరెక్టర్ డా. బైరాగి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spotlight

Read More →