Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు!

Thiruchanuru: వైభవంగా ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు!

Thiruchanuru: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం భక్తి పరవశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

Published : 2026-04-30 20:22:00

శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌..

మే  1న స్వర్ణరథోత్సవం..

తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం భక్తి పరవశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరగనుండటం విశేషం.

వసంత ఋతువులో సూర్యుడు మేషరాశిలో అధిక ప్రభావంతో ప్రకాశిస్తాడని, ఈ సమయంలో వచ్చే వేడి వల్ల మనుషులకు అనేక శారీరక ఇబ్బందులు కలుగుతాయని భావిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధిస్తే భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.

ఉత్సవాల తొలి రోజున ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి అమ్మవారిని అలంకరించారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.

ఈసారి శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా ప్రత్యేకంగా అలంకరించారు. టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పచ్చని చెట్లు, రంగురంగుల పుష్పాలు, జంతువుల ఆకృతులతో తోటను అందంగా తీర్చిదిద్దారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ అలంకరణ కోసం సుమారు 300 కేజీల వట్టి వేరు, 500 కేజీల సంప్రదాయ పుష్పాలు, 15 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన నిపుణులతో పాటు టీటీడీ సిబ్బంది కలిసి ఈ అందమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇదే సమయంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా భక్తులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు పణబాక లక్ష్మీ, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమేష్, సురేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కటాక్షాలను పొందారు.

Spotlight

Read More →