శ్రీశైలం భక్తులకు అదిరిపోయే శుభవార్త..! ఉచితంగా లడ్డూలు.. అవి కూడా ఫ్రీ.. ఫ్రీ..! Sleeping: లేట్ నైట్ నిద్ర హార్ట్‌కు ప్రమాదం.. 16% పెరిగిన రిస్క్! ధనుష్-సాయి పల్లవి మ్యాజిక్ రిపీట్.. D55లోకి 'రౌడీ బేబీ' ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. క్రీమీ అండ్ టేస్టీ.. కేరళ స్టైల్ కొబ్బరి పాల కోడి కూర! తయారీ విధానం... ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..! రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చ! Silver Price 2026: వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఆభరణాల కోసం కాదు.. ఈ కార్ల వల్లే! ఏపీలో ఉద్యోగాల జాతర! మెగా జాబ్ క్యాలెండర్‌కు ముహూర్తం ఖరారు! శ్రీశైలం భక్తులకు అదిరిపోయే శుభవార్త..! ఉచితంగా లడ్డూలు.. అవి కూడా ఫ్రీ.. ఫ్రీ..! Sleeping: లేట్ నైట్ నిద్ర హార్ట్‌కు ప్రమాదం.. 16% పెరిగిన రిస్క్! ధనుష్-సాయి పల్లవి మ్యాజిక్ రిపీట్.. D55లోకి 'రౌడీ బేబీ' ఎంట్రీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే! Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. క్రీమీ అండ్ టేస్టీ.. కేరళ స్టైల్ కొబ్బరి పాల కోడి కూర! తయారీ విధానం... ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్! సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..! రాష్ట్ర భవిష్యత్తుపై కీలక చర్చ! Silver Price 2026: వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఆభరణాల కోసం కాదు.. ఈ కార్ల వల్లే! ఏపీలో ఉద్యోగాల జాతర! మెగా జాబ్ క్యాలెండర్‌కు ముహూర్తం ఖరారు!

Central Govt Schemes: ప్రాణాలు కాపాడితే రూ. 25 వేల బహుమతి.. 'రహ్ వీర్' పథకం పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాద బాధితులను 'గోల్డెన్ అవర్'లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రూ. 25,000 నగదు బహుమతి అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రహ్ వీర్' పథకం వివరాలు, దరఖాస్తు ప్రక్రియ రివార్డు పొందే విధానం గురించి పూర్తి సమాచారం

Published : 2026-02-03 09:55:00

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో చాలామంది ప్రమాద స్థలంలో సాయం చేసేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి భయాలను పోగొట్టి, మానవత్వాన్ని చాటుకునేలా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రహ్ వీర్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తాజాగా స్పష్టత ఇచ్చారు.

ప్రమాదం జరిగిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్' గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే బతికే అవకాశాలు 90 శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఎవరైనా వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు ఆ బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని ఈ పథకం కింద 'రహ్ వీర్'గా గుర్తిస్తారు.

నగదు బహుమతి: ప్రాణాలు కాపాడిన వారికి గతంలో రూ. 5 వేలు ఇచ్చేవారు, ప్రస్తుతం దానిని రూ. 25,000 కు పెంచారు.

ప్రశంసా పత్రం: నగదుతో పాటు ప్రభుత్వం తరపున అధికారిక అభినందన పత్రాన్ని అందజేస్తారు.

జాతీయ స్థాయి గుర్తింపు: ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది రహ్ వీర్‌లను ఎంపిక చేసి, వారికి రూ. 1 లక్ష నగదు, సర్టిఫికేట్ మరియు ట్రోఫీతో గౌరవిస్తారు.

ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి చేర్చిన వెంటనే అక్కడి వైద్యులు సహాయం చేసిన వ్యక్తికి ఒక ఎక్‌నాలెడ్జ్‌మెంట్ (ధృవీకరణ పత్రం) ఇస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతి నెలా సమావేశమై, వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. అర్హులైన వారి జాబితాను రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. తుది ఎంపిక పూర్తయిన తర్వాత రివార్డు సొమ్ము నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

 రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారిని పోలీసులు ఎలాంటి వేధింపులకు గురి చేయకూడదని, వారి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్పందించి, ఆపదలో ఉన్నవారిని కాపాడి 'రహ్ వీర్'లుగా నిలవాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు

Spotlight

Read More →