రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన తెలుసు కదా సినిమా ఈరోజు (అక్టోబర్ 17) థియేటర్లలో విడుదలైంది. ‘జాక్’ వంటి డిజాస్టర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ చేసిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై వచ్చిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ట్విట్టర్లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది.
ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాపై మంచి టాక్ వినిపిస్తుండడంతో, సిద్ధు మరోసారి హిట్టు ఖాతాలో వేసుకున్నట్టేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం సిద్ధు పోషించిన ‘వరుణ్’ పాత్ర చుట్టూ తిరుగుతుంది సిద్ధు చెప్పినట్లుగానే ఇందులో యాక్షన్ ఉండదు కానీ ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది
సిద్ధు వన్ మ్యాన్ షో లో వరుణ్ పాత్రలోని సైకలాజికల్ వైలెన్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్లను సిద్ధు అద్భుతంగా పండించాడు. ఆధునిక యువతరం ఎదుర్కొనే సంబంధాల సంఘర్షణను ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలిచాయని తెలుపుతున్నారు.
ముఖ్యంగా దర్శకురాలు నీరజ కోన తన తొలి ప్రయత్నంలోనే తనదైన ముద్ర వేశారని సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరూ తమ గ్లామర్, ఎమోషన్లను సమపాళ్లలో చూపించారని సిద్ధు నటనకు తోడు వీరిద్దరి పెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా నిలిచింది అని చెప్పుకోవాలి
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా ఫీల్ను పెంచిందని, అది సినిమాకు జీవం పోసింది హర్ష చెముడు కామెడీ బాగా వర్కౌట్ అయిందని మొత్తం మీద ‘తెలుసు కదా’ అనేది ప్రేమ, నవ్వులు, భావోద్వేగాల మిశ్రమంతో కూడిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్ విజయ పరంపరంలో కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.