Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? TTD: తిరుమల భక్తులకు ఊరట... లడ్డూల కోసం ఇక క్యాష్ అవసరం లేదు! శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి షురూ! ప్రత్యేకతలు ఇవే! తిరుమల భక్తులకు శుభవార్త... ఇక వాట్సాప్‌లోనే దర్శనం టికెట్లు! శ్రీశైల పాదయాత్ర భక్తులకు తీపి కబురు..! అటవీ మార్గంపై ప్రభుత్వం కీలక నిర్ణయం! Maha Shivaratri 2026: శివుడికి శంఖు పుష్పాలు సమర్పిస్తే ఇన్ని లాభాలా? TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర!

అయోధ్యకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేక పరిమళాల(పెర్ఫ్యూమ్) తో స్వాగతం...

అయోధ్యకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేక పరిమళాల పెర్ఫ్యూమ్ బాటిళ్లు... భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న

Published : 2024-01-22 11:27:00

అయోధ్యకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేక పరిమళాల పెర్ఫ్యూమ్ బాటిళ్లు...


భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. ఈ మేరకు ప్రారంభోత్సవానికి అయోధ్య పూర్తిగా సిద్ధమైంది. జగదాభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది.ప్రాణప్రతిష్ట వేడుకలను చూసేందుకు వేలాదిగా రామభక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు... ఆలయ సముదాయం, అయోధ్యా నగరంలో రామనామస్మరణలతో మర్మోగుతోంది. ఆలయంలో ప్రతి మూల, దీపాలు, పూలతో అంగరంగ వైభవముగా అలంకరించబడ్డాయి.

ఈ సందర్భంగా అతిధుల అందరినీ ఓ ప్రత్యేకమైన సువాసనతో స్వాగతం పలుకనుంది అయోధ్య ఆలయం. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా, అయోధ్యలో సువాసనలు వెదజల్లేలా బరేలీకి చెందిన ఓ వ్యాపారి ప్రత్యేకంగా పరిమళాలను (పెర్ఫ్యూమ్‌)ను తయారు చేశారు.

బరేలికి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ మిట్టల్ ఈ ప్రత్యేక పరిమళాలను తయారు చేయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ప్రత్యేక పరిమళ ద్రవ్యాలను అయోధ్య, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా అందించామని చెప్పారు. అలాగే అయోధ్యకు వచ్చే ప్రముఖులకు అందించేలా సుగంధ ద్రవ్యాల సీసాలు, ధూపద్రవ్యాలను ప్రత్యేకంగా పంపారట. బరేలీ నుంచి మొత్తం 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు, 7,000 కుంకుమపువ్వు అగరుబత్తీలను ఆయన పంపించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేకమైన పరిమళాన్ని సృష్టించమని నన్ను అడిగారు. ఇందుకోసం కస్తూరి పరిమళం, కుంకుమ ధూపం తయారు చేశాను. రాముడు జన్మించినప్పుడు, దశరథుడు అయోధ్య అంతటా చందనం, కస్తూరిని చల్లారని రామచరితమానస్‌లో ప్రస్తావించారు. నేను కూడా అదే మూలకాలను ఉపయోగించి సహజమైన సువాసనను సృష్టించాను’ అని మిట్టల్ చెప్పారు.
పెర్ఫ్యూమ్‌ను రూపొందించడానికి మిట్టల్ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఆ బృందం ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను తయారు చేశారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →