Pattadar Passbooks: ఏపీ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 2 నుంచి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ!

2025-12-27 07:02:00
Shankar Vilas ROB: శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు ఆగలేదు.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు న్యూ ఇయర్ సందర్భంగా శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఈ పంపిణీ కార్యక్రమం జనవరి 2 నుంచి 9 వరకు గ్రామాల్లో నిర్వహించనున్నారు. గ్రామసభల ద్వారా రైతులకు నేరుగా పాస్‌పుస్తకాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.. నేరస్తులకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక!

గత ప్రభుత్వం ఇచ్చిన భూహక్కు పత్రాల (BHP) స్థానంలో ఇప్పుడు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తారు. వీటి ముద్రణ కోసం ప్రభుత్వం దాదాపు రూ.22.50 కోట్లు ఖర్చు చేసింది. గత 8 నెలలుగా వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఇక ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర! జనసేన, బీజేపీలకు దక్కిన ఏఎంసీ పీఠాలు – మహిళా నేతలకు పెద్దపీట! గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్‌గా..

జనవరి 2 నుంచి 9 వరకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ గ్రామసభల్లో రైతుల వివరాలను వెబ్‌ల్యాండ్ డేటాతో సరిపోల్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని, ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తిచేస్తారు.

Nara Lokesh: AI డిమాండ్‌కు ఏపీ సిద్ధం.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన!

అలాగే పాత భూహక్కు పత్రాలను రైతుల నుంచి తిరిగి తీసుకుంటారు. ఈ పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమం తేదీ, సమయాన్ని ముందుగానే ప్రజాప్రతినిధులకు, రైతులకు తెలియజేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా షెడ్యూల్‌ను డిసెంబరు 30లోపు ఉన్నతాధికారులకు పంపాలని రెవెన్యూ శాఖకు సూచించింది.

National award: ప్రాణాలను లెక్కచేయని పదేళ్ల బాలుడు.. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు!

ముద్రించిన పాస్‌పుస్తకాలలో కొన్ని తీవ్రమైన తప్పులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. చనిపోయిన రైతుల పేర్లు, అక్షర దోషాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తప్పులను అక్కడికక్కడే సరిదిద్దాలని తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. చనిపోయిన రైతుల స్థానంలో వారి వారసులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tata Steel: టాటా స్టీల్ ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు…! రూ.14 వేల కోట్ల దావా!
Praja Vedika: రేపు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Coconut Dosa: నోట్లో కరిగిపోయే కొబ్బరి దోశ… రుచికి కొత్త అర్ధం.. హెల్తీ & టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.! భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే – డీటెయిల్స్ ఇవే!
Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్!

Spotlight

Read More →