Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే!

Tata Steel: టాటా స్టీల్ ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు…! రూ.14 వేల కోట్ల దావా!

 టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై అక్కడి ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి దిగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కంపెనీ కార్యక

Published : 2025-12-26 18:57:00
Praja Vedika: రేపు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై అక్కడి ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటానికి దిగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కంపెనీ కార్యకలాపాల వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని, పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ నెదర్లాండ్స్‌లోని నార్త్ హాలెండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్‌జీవో దావా దాఖలు చేసింది. ఈ కేసులో పరిహారంగా 1.6 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.14,370 కోట్లు) చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. యూరప్‌లో టాటా స్టీల్ కార్యకలాపాలపై ఇంత భారీ స్థాయిలో నష్టపరిహారం కోరుతూ కేసు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Coconut Dosa: నోట్లో కరిగిపోయే కొబ్బరి దోశ… రుచికి కొత్త అర్ధం.. హెల్తీ & టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!

టాటా స్టీల్ తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. నెదర్లాండ్స్‌లోని వెల్సన్-నూర్డ్ ప్రాంతంలో ఉన్న ఐజ్మెయిడన్ బీవీ స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న కాలుష్యకారకాలు స్థానిక ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఎన్‌జీవో ఆరోపిస్తోంది. గాలి, నీరు, మట్టిలో కాలుష్యం పెరగడంతో ప్రజలు నిత్యం భయాందోళనల్లో జీవించాల్సి వస్తోందని, ఇంట్లో కూడా ప్రశాంతంగా గడపలేకపోతున్నారని పేర్కొంది. అంతేకాదు, కాలుష్య ప్రభావం వల్ల ఆ ప్రాంతంలోని ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని, ప్రజలకు ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరిగిందని ఎన్‌జీవో తన పిటిషన్‌లో పేర్కొంది.

POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.! భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే – డీటెయిల్స్ ఇవే!

అయితే ఈ ఆరోపణలను టాటా స్టీల్ తీవ్రంగా ఖండించింది. ఎన్‌జీవో చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. తమ కార్యకలాపాలు నెదర్లాండ్స్ ప్రభుత్వం విధించిన పర్యావరణ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగానే కొనసాగుతున్నాయని టాటా స్టీల్ తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తమకు అనుకూలంగా బలమైన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, వాస్తవాలకు దూరమైన ఆరోపణలతో తమ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని స్పష్టం చేసింది.

Infosys: ఫ్రెషర్లకు గోల్డెన్ ఛాన్స్.. రూ.21 లక్షల ప్యాకేజీతో ఇన్ఫోసిస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్!

ఈ కేసు విచారణ రెండు దశల్లో కొనసాగుతుందని, ఒక్కో దశ పూర్తయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉందని టాటా స్టీల్ వెల్లడించింది. అందువల్ల సమీప భవిష్యత్తులో పరిహారం చెల్లించే పరిస్థితి తలెత్తే అవకాశం లేదని స్పష్టం చేసింది. మరోవైపు, నెదర్లాండ్స్ ప్రభుత్వంతో కలిసి కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ఉద్గారాలను నియంత్రించేందుకు భారీ పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరింత పర్యావరణ అనుకూల ఉత్పత్తి విధానాలను అవలంబిస్తామని టాటా స్టీల్ పేర్కొంది. ఈ కేసు టాటా స్టీల్ యూరోప్ కార్యకలాపాలపై ఎంత ప్రభావం చూపుతుందో అనేది రానున్న సంవత్సరాల్లో తేలనుంది.

5G New Phone: బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, ఫీచర్లు అదుర్స్! పూర్తి వివరాలు మీకోసం..
దశాబ్దాల నిరీక్షణకు తెర.. ఆ ఊరిలో ఆగనున్న మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు! రైల్వే శాఖ కీలక నిర్ణయం.!
హైదరాబాద్‌లో ఈ రూట్లల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వచ్చేశాయ్.!
హైదరాబాద్ జూపార్క్ లో ఆ జంతువు..! ఒకే రోజు 23 వేల మంది సందర్శన.. రికార్డులు బద్దలు!
Bank Hlidays: డిసెంబర్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏయే రోజు తెలుసా?
Indian Railways: నేటి నుండి రైలు ప్రయాణం కూడా ఖరీదేనా.. టికెట్ ధరలు పెంపు! పూర్తి వివరాలు ఇవే!

Spotlight

Read More →