Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.! Modi: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశానికి సరికొత్త దశ, దిశ! మోదీ కీలక హామీ.. Chandrababu Naidu: రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ.. మహిళా బిల్లుపై కీలక చర్చ! LokSabha Update: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం! లోక్‌సభలో దిగ్గజ గాయని ఆశా భోస్లేకు నివాళి...! Vande Bharat Sleeper: ఏపీ మీదుగా ముంబై-బెంగళూరు వందే భారత్.. తగ్గునున్న ప్రయాణ సమయం! ఈ రూట్లోనే.... Kollu Ravindra: "జగన్ బతుకే ఒక అరాచకం": మత్స్యకారులను రెచ్చగొడుతున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.! Modi: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశానికి సరికొత్త దశ, దిశ! మోదీ కీలక హామీ.. Chandrababu Naidu: రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ.. మహిళా బిల్లుపై కీలక చర్చ! LokSabha Update: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం! లోక్‌సభలో దిగ్గజ గాయని ఆశా భోస్లేకు నివాళి...! Vande Bharat Sleeper: ఏపీ మీదుగా ముంబై-బెంగళూరు వందే భారత్.. తగ్గునున్న ప్రయాణ సమయం! ఈ రూట్లోనే.... Kollu Ravindra: "జగన్ బతుకే ఒక అరాచకం": మత్స్యకారులను రెచ్చగొడుతున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!

Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' డీలిమిటేషన్ విధానంపై బీజేపీ యువ నేత, ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ఈ రకమైన సలహాలు ఎవరు ఇచ్చారో గానీ, ఆయన వాదన ఏమాత్రం సాధ్యం కానిదని, దానిని విని తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Published : 2026-04-16 16:40:00
  • దేశాన్ని ముక్కలు చేయడం బీజేపీ సంస్కృతి కాదు: "అఖండ భారతమే మా లక్ష్యం" అన్న తేజస్వి..
     
  • Politics: "డీలిమిటేషన్‌ను రాజకీయం చేయొద్దు": దేశ అభివృద్ధిలో పునర్విభజన అత్యంత కీలకం..

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 'హైబ్రిడ్ మోడల్' డీలిమిటేషన్ విధానంపై బీజేపీ యువ నేత, ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ఈ రకమైన సలహాలు ఎవరు ఇచ్చారో గానీ, ఆయన వాదన ఏమాత్రం సాధ్యం కానిదని, దానిని విని తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జనాభాతో పాటు జీడీపీని ప్రాతిపదికన తీసుకోవాలన్న సీఎం వాదన అర్థం లేనిదని, జీడీపీలో ప్రతి ఆరు నెలలకు హెచ్చుతగ్గులు ఉండటం సహజమని పేర్కొన్నారు. ఒకవేళ జీడీపీ పడిపోతే అప్పుడు నియోజకవర్గాల సంఖ్యను కూడా తగ్గించాలా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు అత్యంత సహేతుకమని, దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన ఇంతకంటే అద్భుతమైన ప్రతిపాదన మరొకటి ఉండదని తేజస్వి సూర్య స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీరుపై కూడా తేజస్వి సూర్య ఘాటు విమర్శలు చేశారు. విపక్షాల అనవసర రాద్దాంతం వల్లే సభ సజావుగా సాగడం లేదని, దీనివల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడే అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్ తరహాలో ఏడాదికి కనీసం 150 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్ నిర్వహిస్తే, ప్రతి సభ్యుడికి తమ గళం వినిపించే అవకాశం దక్కుతుందని సూచించారు. గతంలో బ్రిటీష్ వారు భారత్-పాకిస్థాన్‌ను విడదీసినట్లే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను అశాస్త్రీయంగా విభజించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని, కానీ బీజేపీ మాత్రం దేశాన్ని ఒక్కటిగా ఉంచేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని తేజస్వి సూర్య వివరించారు. దేశాన్ని ముక్కలు చేయడం బీజేపీ సంస్కృతి కాదని, ఆసేతు హిమాచలం నుండి అఖండ భారతంగా ఉంచాలన్నదే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలను దక్షిణాది ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు. డీలిమిటేషన్ అనేది దేశ అభివృద్ధికి అవసరమైన ప్రక్రియ అని, దానిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని తేజస్వి సూర్య ధీమా వ్యక్తం చేశారు.

Spotlight

Read More →