Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.! Modi: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశానికి సరికొత్త దశ, దిశ! మోదీ కీలక హామీ.. Chandrababu Naidu: రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ.. మహిళా బిల్లుపై కీలక చర్చ! LokSabha Update: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం! లోక్‌సభలో దిగ్గజ గాయని ఆశా భోస్లేకు నివాళి...! Vande Bharat Sleeper: ఏపీ మీదుగా ముంబై-బెంగళూరు వందే భారత్.. తగ్గునున్న ప్రయాణ సమయం! ఈ రూట్లోనే.... Kollu Ravindra: "జగన్ బతుకే ఒక అరాచకం": మత్స్యకారులను రెచ్చగొడుతున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Nara Lokesh: సైకో వైఖరి వీడండి.. దేశం అంటే ద్వేషం.. మనసంతా విధ్వంసం" అంటూ జగన్‌పై లోకేశ్ ఫైర్.. Parliament: పార్లమెంట్‌లో హైటెన్షన్.. సమావేశాల్లో రచ్చ రచ్చ..మహిళా బిల్లుపై అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్! Nara Lokesh: తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు! జగన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు! Gottipati Ravi: "ఒకవైపు పార్టీ.. మరోవైపు పెట్టుబడులు": మంత్రిగా, నాయకుడిగా లోకేశ్ ద్వంద్వ పాత్రపై ప్రశంసల జల్లు.. Revanth Reddy: దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరు.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే వారిపై తేజస్వి సూర్య ఫైర్.! Modi: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశానికి సరికొత్త దశ, దిశ! మోదీ కీలక హామీ.. Chandrababu Naidu: రేపు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ.. మహిళా బిల్లుపై కీలక చర్చ! LokSabha Update: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం! లోక్‌సభలో దిగ్గజ గాయని ఆశా భోస్లేకు నివాళి...! Vande Bharat Sleeper: ఏపీ మీదుగా ముంబై-బెంగళూరు వందే భారత్.. తగ్గునున్న ప్రయాణ సమయం! ఈ రూట్లోనే.... Kollu Ravindra: "జగన్ బతుకే ఒక అరాచకం": మత్స్యకారులను రెచ్చగొడుతున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్! Nara Lokesh: సైకో వైఖరి వీడండి.. దేశం అంటే ద్వేషం.. మనసంతా విధ్వంసం" అంటూ జగన్‌పై లోకేశ్ ఫైర్.. Parliament: పార్లమెంట్‌లో హైటెన్షన్.. సమావేశాల్లో రచ్చ రచ్చ..మహిళా బిల్లుపై అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్!

Modi: 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశానికి సరికొత్త దశ, దిశ! మోదీ కీలక హామీ..

Modi: దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈరోజును మరిచిపోలేం – మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు – 30 ఏళ్లపాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదు – దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం – మహిళలను కలుపుకుని ముందుకెళ్తున్నాం – మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు

Published : 2026-04-16 16:31:00
  • "క్రెడిట్ అందరిదీ.. అందరూ కలిసి రండి": మహిళా బిల్లు ఆమోదానికి విపక్షాలకు ప్రధాని పిలుపు..
     
  • Politics: "విభజన రాజకీయాలు ఆపండి": ఉత్తరాది-దక్షిణాది వివాదంపై ప్రధాని మండిపాటు..

Modi: భారత పార్లమెంటరీ చరిత్రలో ఈరోజు అపూర్వమైన ఘట్టమని, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ ప్రగతిలోనే ఒక గొప్ప మలుపుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గత 30 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ సాకారం కాని ఈ బిల్లును, ప్రస్తుత ప్రభుత్వం మహిళా శక్తిపై ఉన్న నమ్మకంతో ముందుకు తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారికి సరైన అవకాశం కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ అంటే కేవలం ఆధునిక రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదని, మహిళల స్వావలంబన మరియు వారి భాగస్వామ్యం ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రక బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని, తమ హక్కులను అడ్డుకునే వారిని వారు ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని, ఇది కేవలం దేశ ప్రజల హితం కోసమే ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 30 ఏళ్ల క్రితమే తాము ఈ బిల్లును తెచ్చామంటూ చెప్పుకుంటున్న వారు, ఆనాడు మహిళలకు ఎందుకు మేలు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని నిలదీశారు. గతంలో అనేక పార్టీలు సాంకేతిక కారణాలు చూపుతూ మహిళల హక్కులను కాలరాశాయని, కానీ ఇప్పుడు అడ్డుకోకుండా ఏకగ్రీవంగా మద్దతివ్వాలని ఆయన విపక్షాలను కోరారు. గ్రామీణ స్థాయిలో రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే మహిళల్లో గొప్ప రాజకీయ అవగాహన వచ్చిందని, వారు నాయకులుగా రాణిస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. చట్టసభల్లో ఒక్కసారి 33 శాతం అవకాశం ఇచ్చి చూస్తే మహిళా శక్తి ఏమిటో ప్రపంచానికి తెలుస్తుందని, తమ హక్కుల కోసం మూడు దశాబ్దాలుగా గొంతు విప్పుతున్న మహిళలకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వాగ్దానం చేశారు.

మహిళా బిల్లు అమలులో భాగంగా డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కొందరు కావాలనే ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం జరగదని, చిన్న రాష్ట్రం లేదా పెద్ద రాష్ట్రం అనే భేదాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చూస్తామని, ప్రతి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ బిల్లు క్రెడిట్ కేవలం తమకే దక్కాలని భావించడం లేదని, దీని విజయంలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు స్వార్థపూరిత ఆలోచనలు పక్కన పెట్టి, దేశ మహిళలకు వారి హక్కులు కల్పించడంలో సహకరించి తమ గొప్పతనాన్ని చాటుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Spotlight

Read More →