Vijaya Sai Reddy Real Face: "మావిగన్" పేరుతో జగన్ కొత్త ప్లాన్.. వ్యవసాయి ముసుగులో విజయసాయి! ఢిల్లీలో మళ్ళీ కుట్రలు! Vijay Kumar: చదరపు అడుగుకు రూ.14 వేలా? ఎక్కడి లెక్కలివి? జగన్ స్క్రిప్ట్ రీడింగ్‌పై విజయ్ కుమార్ సెటైర్లు.! Raghav Chadha vs AAP: నన్ను గాయపరిచారు.. ఇక నా విశ్వరూపం చూస్తారు - భగవంత్ మాన్ విమర్శలకు రాఘవ్ చడ్డా పవర్‌ఫుల్ కౌంటర్.!! AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు! Chandrababu: అమరావతి పనుల్లో నాణ్యతే ప్రాధాన్యం – గడువులోగా పూర్తి చేయాల్సిందే- సీఎం చంద్రబాబు! Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. Vijaya Sai Reddy Real Face: "మావిగన్" పేరుతో జగన్ కొత్త ప్లాన్.. వ్యవసాయి ముసుగులో విజయసాయి! ఢిల్లీలో మళ్ళీ కుట్రలు! Vijay Kumar: చదరపు అడుగుకు రూ.14 వేలా? ఎక్కడి లెక్కలివి? జగన్ స్క్రిప్ట్ రీడింగ్‌పై విజయ్ కుమార్ సెటైర్లు.! Raghav Chadha vs AAP: నన్ను గాయపరిచారు.. ఇక నా విశ్వరూపం చూస్తారు - భగవంత్ మాన్ విమర్శలకు రాఘవ్ చడ్డా పవర్‌ఫుల్ కౌంటర్.!! AP Ration Card Updates: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక మీసేవ కేంద్రాల్లోనే మార్పులు, చేర్పులు! Chandrababu: అమరావతి పనుల్లో నాణ్యతే ప్రాధాన్యం – గడువులోగా పూర్తి చేయాల్సిందే- సీఎం చంద్రబాబు! Chandrababu: మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్.. నిందితుడికి నరకం చూపించాలి... Amaravati Capital: రాజధానిపై 9 సార్లు మాట మార్చారు.. మీకా విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు? Kollu Ravindra: విజయవాడలో ఏఐ సమ్మిట్ ప్రారంభం! 25 ఏళ్ల క్రితమే ఏఐ విజన్‌ను చూసిన చంద్రబాబు- కొల్లు రవీంద్ర! AP Govt: 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. సరికొత్త రూపం.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నూతన మ్యాప్! Bhanu Prakash Reddy: వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు.. తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

AmaravatiBill: చరిత్ర సృష్టించిన అమరావతి: రాజ్యసభలోనూ చట్టబద్ధత బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!!

AmaravatiBill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన భరోసా కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్‌సభ తర్వాత ఎగువ సభలోనూ ఈ కీలక ఘట్టం పూర్తి కావడంతో అమరావతి చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.

Published : 2026-04-02 17:11:00

AmaravatiBill: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరపడింది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్థిరపరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు'కు రాజ్యసభ నేడు పచ్చజెండా ఊపింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు, ఎగువ సభలో కూడా నెగ్గడంతో రాజధాని అమరావతికి ఇక తిరుగులేని చట్టబద్ధత చేకూరింది. ముగిసిన చర్చ అనంతరం సభ్యులందరి మద్దతుతో బిల్లును మూజువాణి ఓటు ద్వారా ఆమోదించారు. దీనివల్ల అమరావతి నిర్మాణానికి మార్గం మరింత సుగమమైంది.

చారిత్రాత్మక ఘట్టం

ఈ సందర్భంగా సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, ఒక రాజధాని కూడా లేకుండా అయిదు కోట్ల మంది ప్రజలు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. గతంలో ఏర్పడిన సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు విజన్ తో అమరావతిని మొదలుపెట్టారని చెప్పారు. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, నేడు ఈ బిల్లు ఆమోదం పొందడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.

రైతుల పోరాటానికి విజయం

అమరావతి కోసం సుమారు 29 వేల మంది రైతులు తమ సొంత భూములను త్యాగం చేయడం ప్రపంచ చరిత్రలోనే అద్భుతమని సభలో చర్చ సందర్భంగా పలువురు సభ్యులు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు ఎదుర్కొన్న లాఠీ దెబ్బలు, అవమానాలను గుర్తు చేస్తూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. ఐదేళ్లుగా అస్పష్టతలో ఉన్న రాజధాని అంశం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని, ఇది కేవలం బిల్లు ఆమోదం మాత్రమే కాదు.. న్యాయం కోసం పోరాడిన వేల మంది రైతుల విజయమని ఆయన అన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు - వాకౌట్

అయితే ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో రాజకీయ వేడి కూడా కనిపించింది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. బిల్లుకు మద్దతు తెలుపుతూనే, విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం చేస్తున్న ఆలస్యాన్ని తప్పుబట్టారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

రాజ్యసభ ఆమోదంతో ఇప్పుడు ఈ బిల్లు కేంద్ర కేబినెట్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ ర్యాటిఫికేషన్ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చడానికి వీలుండదు. అమరావతికి ఈ భరోసా దక్కడంతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తిరిగి రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉంది. ఈ పరిణామంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Spotlight

Read More →