లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!!

Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!!

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగించడంతో, రూ. 27 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.

Published : 2026-02-02 12:04:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్' (JJM) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం గడువును 2028 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏపీలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల తాగునీటి ప్రాజెక్టులకు పునర్జీవం పోసినట్లయింది.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు తీవ్ర కుంటుపడింది. గత ప్రభుత్వం తన వంతు వాటా నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో, కేంద్రం మంజూరు చేసిన రూ. 27,000 కోట్ల విలువైన పనుల్లో కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. నిధుల కొరత కారణంగా జలాశయాల నుంచి పైపులైన్ల నిర్మాణం, శుద్ధి కేంద్రాల ఏర్పాటు వంటి కీలక పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల లక్ష్యం నెరవేరలేదు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం, ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం భూగర్భ జలాలపై (బోర్లు) ఆధారపడకుండా, నదులు మరియు ప్రధాన జలాశయాల నుంచి ఉపరితల జలాలను సేకరించి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 84,500 కోట్లతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను (DPR) సిద్ధం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి సమయం అవసరమని గుర్తించిన ముఖ్యమంత్రి, గడువు పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కేంద్రం సానుకూలంగా స్పందించి 2028 వరకు గడువు ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రూ. 23 వేల కోట్ల పనులకు మోక్షం గడువు పొడిగింపుతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 23,000 కోట్ల విలువైన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ

కేంద్ర వాటా: 50 శాతం నిధులను (రూ. 13,500 కోట్లు) కేంద్రం నుంచి రాబట్టేందుకు మార్గం సుగమమైంది.

రాష్ట్ర వాటా: ప్రభుత్వం తన వంతు నిధుల కోసం జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (NaBFID) నుంచి రూ. 10,000 కోట్ల రుణాన్ని సమీకరిస్తోంది.

అదనపు నిధులు: మరో రూ. 3,000 కోట్లను బడ్జెట్ ద్వారా కేటాయించి, మొత్తం రూ. 13,000 కోట్లతో పనులను పరుగులు పెట్టించాలని భావిస్తోంది.

2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి గడపకూ కుళాయి కనెక్షన్ ఇవ్వడమే కాకుండా, వేసవిలో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. జల్ జీవన్ మిషన్ గడువు పెరగడం వల్ల అటు కాంట్రాక్టర్లకు బకాయిల చెల్లింపులు, ఇటు కొత్త పనుల టెండర్ల ప్రక్రియ వేగవంతం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో మైలురాయిగా నిలవనుంది.

Spotlight

Read More →