మిడిల్ ఈస్ట్ టెన్షన్లకి చెక్.. భారత్ సరికొత్త రూట్
రష్యా, ఫ్రాన్స్లకి షాక్.. మన రూటే వేరు
చైనా ఎత్తులకు పై ఎత్తు.. ఆర్థికంగా దూకుడు
అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా శక్తి వనరుల విషయంలో అగ్రరాజ్యాల మధ్య జరిగే మైండ్ గేమ్స్ మామూలుగా ఉండవు. 2026 ఆరంభంలోనే ప్రపంచ దేశాలు అవాక్కయ్యేలా భారత్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ క్రూడ్ ఆయిల్, గ్యాస్ కోసం అరబ్ దేశాల వైపు చూసే పరిస్థితికి చెక్ పెడుతూ, కెనడాతో భారీ ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు కూడా భారత్ వేసిన ఈ ఎత్తుగడను చూసి ఇప్పుడు షాక్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఇరాన్ చుట్టూ జరుగుతున్న యుద్ధ వాతావరణం చూస్తుంటే, గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరా ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆ ప్రాంతంలో యుద్ధం మొదలైతే మన దేశంలో ఫ్యాక్టరీలు, వాహనాలు, వంట గ్యాస్ అన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ తన దృష్టిని నార్త్ అమెరికా వైపు మళ్లించింది. కెనడా దగ్గర అపారమైన నాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ఇప్పటి వరకు వాళ్లు కేవలం అమెరికాకే వీటిని అమ్మేవారు. కానీ ఇప్పుడు భారత్ లాంటి నమ్మకమైన, వేగంగా ఎదుగుతున్న మార్కెట్ కోసం కెనడా తన ద్వారాలు తెరిచింది. చాలా తక్కువ ధరకే లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (LNG) సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది.
ఇన్నాళ్లూ మనకు తక్కువ రేటుకు ఆయిల్ ఇస్తున్నాం కదా అని రష్యా కొంచెం ధీమాగా ఉండేది. కానీ ఇప్పుడు కెనడాతో మన డీల్ చూసి మాస్కోలో చర్చ మొదలైంది. భారత్ ఇక తమ మీద మాత్రమే ఆధారపడదని వారికి అర్థమైంది. అటు ఫ్రాన్స్ కూడా మనకు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల ద్వారా ఎనర్జీని అంటగట్టాలని ప్లాన్ చేసింది. అయితే న్యూక్లియర్ పవర్ రావడానికి ఏళ్ల సమయం పడుతుంది, కానీ మనకు ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది గ్యాస్. అందుకే మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడ లాభం ఉంటే అక్కడికే వెళ్తామని భారత్ తన డిప్లమసీ పవర్ చూపిస్తుంది.
ఈ డీల్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, కెనడా నుంచి గ్యాస్ షిప్స్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా నేరుగా మన పశ్చిమ తీరానికి చేరుతాయి. అంటే, గల్ఫ్ దేశాల్లో గొడవలు జరిగినా, సుయజ్ కెనాల్లాంటి ఇరుకైన జలసంధుల్లో ట్రాఫిక్ ఆగిపోయినా మన గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదు. -162 డిగ్రీల వద్ద గ్యాస్ను లిక్విడ్గా మార్చి తెచ్చే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కెనడా వాడటం వల్ల రవాణా ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి. దీనివల్ల సామాన్యుడికి ఒరిగే లాభం ఏంటంటే, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగినా మన దగ్గర ఎల్పీజీ ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది.
మన ఎనర్జీ సప్లైని దెబ్బకొట్టాలని చైనా వేసిన ప్లాన్లన్నీ ఈ కెనడా డీల్తో ఫెయిల్ అయ్యాయి. మన ఇండస్ట్రీలకి తక్కువ ధరకే పవర్ దొరికితే, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి 'మేక్ ఇన్ ఇండియా' వస్తువులు చైనా కంటే తక్కువ ధరకే ప్రపంచ మార్కెట్లో దొరుకుతాయి. ఇది మన ఎకానమీని 5 ట్రిలియన్ డాలర్ల వైపు తీసుకెళ్లేందుకు ఒక బూస్ట్ లాంటిది. పాత గొడవలు పక్కన పెట్టి మరి కెనడా మనతో చేతులు కలిపిందంటే, ప్రపంచ వేదికపై భారత్ ఎంతటి పవర్ ఫుల్ దేశంగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికీ తలవంచకుండా, మన స్వలాభమే పరమావధిగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించబోతోంది.