Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ..

Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Central Secretariat: అమరావతిలో రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ మరియు కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. సీఆర్డీఏ కేటాయించిన 22.53 ఎకరాల్లో ఈ అత్యాధునిక భవనాలు నిర్మించనున్నారు.

Published : 2026-04-08 19:00:00

Politics- అమరావతిలో మినీ ఢిల్లీ…

సీఆర్డీఏ కేటాయించిన 22 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్…..

కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవ..

Central Secretariat: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంజూరు చేసింది. రాజధాని ప్రాంతంలో 'కామన్ సెంట్రల్ సెక్రటేరియట్' మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించి రూ. 2,534 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమైంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సిద్ధం చేసిన ఈ ప్రతిపాదిత నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమోదించారు. ప్రస్తుతం ఈ డీపీఆర్ కేంద్ర కేబినెట్ తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టు మంజూరు కోసం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి దీనిని పట్టాలెక్కించారు.

భారీ ప్రాజెక్టును ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మించే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనానికి రూ. 1,299.08 కోట్లు ఖర్చు చేయనుండగా, ఇక్కడ పనిచేసే ఉద్యోగుల నివాస గృహాల కోసం మరో రూ. 1,234.91 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇప్పటికే సుమారు 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ భవనం, మిగిలిన 17 ఎకరాల్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఈ కామన్ సెక్రటేరియట్ ను డిజైన్ చేశారు.

కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు అమరావతిలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి వసతులు రానున్నాయి. హుడ్‌కో (HUDCO) సంస్థ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అమరావతికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కడంతో పాటు, పరిపాలనా పరంగా రాజధాని నగరం మరింత బలోపేతం కానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. త్వరలోనే ఈ నిర్మాణాలకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Spotlight

Read More →