- 5వేల మినీ అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసిన కూటమి ప్రభుత్వం..
- కూటమి ప్రభుత్వంలో కొట్టాది రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సౌకర్యలు..
Kolusu Parthasarathy: మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో మహిళలు పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించడంతో పాటు వాటికి స్వంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో చొరవ చూపుతోంది. దశాబ్దాల గా వీరు అందిస్తున్న సేవలు గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక ప్రయోజనాలు కల్పించడం తోబాటు పని ప్రదేశంలో సౌకర్యాలు మెరుగుపరిచి ప్రమాణాలు పెంపొందించడానికి గత ఇరవై నెలల్లో ఎన్నో ముందడుగులు పడ్డాయి.
త్రాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నమన్నారు. ప్రభుత్వం మహిళలు పిల్లలకు తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవని సకాలంలో టీచర్లకు జీతాలు చెల్లించే వారు కాదని టీచర్లు నానా ఇబ్బందులు పడేవారని అంగన్వాడీ సెంటర్లలో టెలివిజన్,ఆర్, ఓ, వాటర్, ఆటవస్తువులు, చార్టులు ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంటపాత్రలు, ఇలా పలు రకాల మౌలిక సదుపాయాలు నెలకొల్పిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చింది మా ప్రభుత్వం ఆన్నారు. అంగన్వాడీ టీచర్ల 9 డిమాండ్లలో చాలా వరకూ నెరవేర్చామన్నారు.
క్రమంగా ప్రతీ నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లింపు. గత ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని దివాళా చేసిందని వారు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని తెలియజేసారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచిందని అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో త్రాగునీరు మరుగుదొడ్లకు రూ.86.68.లక్షలు ఖర్చు చేశామని తెలిపారు.
గతంలో కేవలం అరకొర జీతాలు ఉండగా కూటమి ప్రభుత్వం టీచర్ల జీతాలు పెంచి అంగన్వాడీ టీచర్ల ఆర్ధిక, సంక్షేమాభివృద్ధికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
సుమారు.75 కోట్లతో.5G, మొబైల్స్ కొనుగోలు చేసి 58,204 మంది టీచర్లుకు అందించామని తద్వారా సెంటర్లలో చిన్నారులకు, గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయన్నారు.