Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Chandrababu: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రాండ్ ఎంట్రీ.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడికి SIPB ఆమోదం! 5,000 మంది యువతకు.. Nara Lokesh: 2028 కల్లా దేశంలో 80% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే- నారా లోకేష్! TVK party: రానున్న 48 గంటలు అత్యంత కీలకం.. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల పహారా.. ఇతర పార్టీల మద్దతుపై విజయ్ క్లారిటీ! Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం! Prakash Raj: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు! Kamal Haasan: విజయ్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం అంటే ప్రజా తీర్పుని అగౌరవ పర్చడమే.. కమల్ హాసన్ నిప్పులు! Chandrababu: కేంద్ర నిధుల మళ్లింపు, రూ. 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లపై సీఎం సమీక్ష! Chandrababu: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రాండ్ ఎంట్రీ.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడికి SIPB ఆమోదం! 5,000 మంది యువతకు.. Nara Lokesh: 2028 కల్లా దేశంలో 80% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే- నారా లోకేష్! TVK party: రానున్న 48 గంటలు అత్యంత కీలకం.. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల పహారా.. ఇతర పార్టీల మద్దతుపై విజయ్ క్లారిటీ! Vijay: తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! మెజారిటీకి 5 సీట్ల దూరంలో.. AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు! Nara Lokesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడులు.. ఎక్స్‌లో ఆసక్తికర వీడియోతో లోకేష్ ప్రకటన! Dwacra Womens: డ్వాక్రా మహిళల కోసం మరో కొత్త పథకం.. పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం! మే 23న ప్రారంభం!

AP Government: ఏపీ సర్కార్ సంచలనం: 51 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు!

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 51 మంది బోధనాసుపత్రుల వైద్యులను ఉద్యోగాల నుండి తొలగించింది. వీరిలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. మరో 33 మందికి మెమోలు జారీ చేస్తూ, ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టబోమని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు.

Published : 2026-05-07 11:00:00

Politics- విధులకు ఎగనామం పెడితే ఉద్వాసనే.. వైద్యులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు…

బోధనాసుపత్రుల్లో ప్రక్షాళన: 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిస్మిస్…

వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం.. 51 మందికి ఉద్వాసన..

AP Government: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో క్రమశిక్షణను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం మరియు వైద్య శాఖ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. ఈ క్రమంలోనే విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై విచారణ చేపట్టిన ప్రభుత్వం, వారిని సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉద్వాసన పలికింది.

తొలగించబడిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు ఇద్దరు ట్యూటర్లు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మరో ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్ల పైనా త్వరలో కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. వీరే కాకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న మరో 33 మంది వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే ఛార్జి మెమోలు జారీ చేసింది. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

బోధనాసుపత్రులలో వైద్యులు లేకపోవడం వల్ల అటు రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగడమే కాకుండా, ఇటు వైద్య విద్యార్థులకు కూడా బోధన కుంటుపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలంగా సెలవుల పేరుతో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన చికిత్స అందేలా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యతని, విధుల్లో రాజీ పడితే వేటు తప్పదని ఈ చర్యల ద్వారా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో జవాబుదారీతనం పెంచేందుకు ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.

Spotlight

Read More →